..

  • This is featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

Monday, 18 November 2013

2. శ్రీకృష్ణ కథామృతం:

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.     

 ఆనాటి రాత్రి కంసుడు నిద్ర పోతుండగా కలలో ఒక శవం వచ్చి కౌగలించుకున్నట్టు, ఎవరో స్త్రీ నల్లటి దేహంతో, ఎర్రటి చీర కట్టుకుని రా రా అని దగ్గరికి వచ్చేస్తున్నట్టు ఇలాంటి భయంకరమైన కలలు వచ్చాయి. కంసుడు దెబ్బకి ఉలిక్కిపడి లేచి మరలా నిద్రపోయాడు. ఆనాటి రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. ఓ పక్కన కలలు చంపేస్తున్నాయి. ఇంకోప్రక్కన శ్రీకృష్ణుడు వస్తాడు అనే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసి నిద్ర పాడుచేశాయి.
ఇంకా అక్రూరుడు (వేగు) మాత్రం ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడిని చూస్తానో? ఎప్పుడూ ఎవరో  శ్రీకృష్ణుడు అంత గొప్ప, ఇంతగొప్ప, సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణుడిగా వచ్చాడు. చాల అందంగా ఉంటాడట, సర్వం, సమస్తం ఆయనేనట! అని చెప్తుంటే వినడం తప్ప  ఇంతవరకు చూసింది లేదు. అని ఎప్పుడు తెల్లరుతుందా! ఎంత వేగంగా వెళదామా అని ఆనందపారవస్యంలో మునిగి అక్రూరుడికి నిద్రపట్టలేదు. ఎలాగైతేనేం! తెల్లారింది. లేచాడు.  ఉదయ సంధ్యావందం చేశాడు. రధాన్ని సిద్దం చేసుకుని కంసుడికి చెప్పి బయలుదేరాడు.
గుర్రాలు యమవేగంతో వెళ్తున్నాయి. అక్రూరుడికి అంతవేగం కూడా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కదా! ఎవరికీ సాధ్యం కాని శ్రీకృష్ణ సాక్షాత్కారం ఇంకొన్ని గడియలలో నాకు సాధ్యం అవుతుంది. కంసుడి పగ నాకు ఈనాడు వరం అయింది. లేదంటే శ్రీకృష్ణుడిని చుసేవాడినా? కంస మహారాజ నీకు నాధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేసినా లభించని దర్శనం నాకు అవుతుంది. దేవతలకి కూడా సాధ్యంకాదు ఆయనని దర్శించడం. అలాంటిది నేను ధర్శించుకోబోతున్నాను. యుగయుగాలుగా ఎందఱో ఋషులు అయన సాక్షాత్కారం కోసం ఎన్నో యజ్ఞాలు, యాగాలు ఆచరించారు. వారికి కూడా పరమ దుర్లభమైన దర్శనం నాకు అవుతుంది. 
కాని నేను వెళ్ళగానే శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడో? శత్రువు పంపిన వేగునని తిరస్కరిస్తాడో, లేక శత్రువు మీద ఉన్న కోపం నామీద చూపి సంహరిస్తాడో? ఏదేమైనా శ్రీకృష్ణుడిని చూస్తాను.  అనుకుంటూ ఇంకెంత దూరం ఇంకెంతదూరం అంటూ వస్తూ ఉండగా గుర్రాలు అంత వేగంలో పరుగెడుతూ కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏంటి ఇలా ఆగిపోయాయని అని ముందు చుస్తే అడుగుల గుర్తులు ఉన్నాయి. ఎవరివి ఈ అడుగుల గుర్తులు అని పరిశీలనగా చుస్తే ఆ గుర్తుల్లో శంకు, చక్ర, గదా, శర్గజం అనే కోదండం ఇంకా ఇతర ఆయుధాల గుర్తులు ఉన్నాయి. ఆ ఐతే ఇప్పుడే కృష్ణుడు ఇటుగా వెళ్లినట్టు ఉన్నాడు. ఆహా ఈ అశ్వాలకి ఎంత శక్తి ఉంది! సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాద ముద్రలని గుర్తించి ఆ పాదాలు దాటకూడదు అని ఆగిపోయాయి. అని పరవశం చెంది క్రిందికి దిగి ఆ అడుగుల గుర్తులని ముద్దాడి శ్రీకృష్ణుడి అడుగుల గుర్తులున్న ఇసుకని వంటినిండా పూసుకున్నాడు. మళ్లి తెలివి తెచ్చుకుని అయ్యయ్యో పాదముద్రలు పాడైపోయ్యాయే! అయ్యో అనుకుంటూ లేచి ఇప్పుడే ఇటు వెళ్లినట్టు ఉన్నాడు. ఎక్కడ అని శ్రీకృష్ణుడు పాదగుర్తులు ఉన్నవైపు చుస్తే అల్లంతదూరంలో నీలివర్ణంలో, తలపై నెమలి పించంతో, చేతిలో పిల్లనగ్రోవితో, దివ్యతేజస్సుతో అన్నగారైన బలరాముడితో కలిసి గోవులదగ్గర నిలబడి ఉన్నాడు. ఆహా జన్మధన్యం అయిపొయింది అని పరుగుపరుగున వెళ్లి శ్రీకృష్ణుడి పాదాలపై సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడి వయస్సు 8సంవత్సరాలు కేవలం. శ్రీకృష్ణుడు చూసి అక్రూరుడితో మేము చిన్నవాళ్ళం. మీరు పెద్దవారు. ఇలా  మా పాదాలపై పడితే మాకు అయుక్షీణం కదా! మీకు ఏమైనా న్యాయమేనా ఇది. అన్నాడు. 
స్వామి మీముందు నేనెంత? చెట్లకి పుట్లకి వస్తాయి ఏళ్ళు. అలాగే నాకు వచ్చాయి. అవతారపురుషుడివి నువ్వు. అన్ని నీలోనే ఇమిడివున్నాయి. సృష్టి అంతటా వ్యాపించివున్నావు. చరాచర జగత్తుకి తండ్రివి నువ్వు. మిగిలునది తరువాత చెప్పుకుందాం.. 
Share:

2. శ్రీకృష్ణ కథామృతం:

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.     

 ఆనాటి రాత్రి కంసుడు నిద్ర పోతుండగా కలలో ఒక శవం వచ్చి కౌగలించుకున్నట్టు, ఎవరో స్త్రీ నల్లటి దేహంతో, ఎర్రటి చీర కట్టుకుని రా రా అని దగ్గరికి వచ్చేస్తున్నట్టు ఇలాంటి భయంకరమైన కలలు వచ్చాయి. కంసుడు దెబ్బకి ఉలిక్కిపడి లేచి మరలా నిద్రపోయాడు. ఆనాటి రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. ఓ పక్కన కలలు చంపేస్తున్నాయి. ఇంకోప్రక్కన శ్రీకృష్ణుడు వస్తాడు అనే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసి నిద్ర పాడుచేశాయి.
ఇంకా అక్రూరుడు (వేగు) మాత్రం ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడిని చూస్తానో? ఎప్పుడూ ఎవరో  శ్రీకృష్ణుడు అంత గొప్ప, ఇంతగొప్ప, సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణుడిగా వచ్చాడు. చాల అందంగా ఉంటాడట, సర్వం, సమస్తం ఆయనేనట! అని చెప్తుంటే వినడం తప్ప  ఇంతవరకు చూసింది లేదు. అని ఎప్పుడు తెల్లరుతుందా! ఎంత వేగంగా వెళదామా అని ఆనందపారవస్యంలో మునిగి అక్రూరుడికి నిద్రపట్టలేదు. ఎలాగైతేనేం! తెల్లారింది. లేచాడు.  ఉదయ సంధ్యావందం చేశాడు. రధాన్ని సిద్దం చేసుకుని కంసుడికి చెప్పి బయలుదేరాడు.
గుర్రాలు యమవేగంతో వెళ్తున్నాయి. అక్రూరుడికి అంతవేగం కూడా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కదా! ఎవరికీ సాధ్యం కాని శ్రీకృష్ణ సాక్షాత్కారం ఇంకొన్ని గడియలలో నాకు సాధ్యం అవుతుంది. కంసుడి పగ నాకు ఈనాడు వరం అయింది. లేదంటే శ్రీకృష్ణుడిని చుసేవాడినా? కంస మహారాజ నీకు నాధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేసినా లభించని దర్శనం నాకు అవుతుంది. దేవతలకి కూడా సాధ్యంకాదు ఆయనని దర్శించడం. అలాంటిది నేను ధర్శించుకోబోతున్నాను. యుగయుగాలుగా ఎందఱో ఋషులు అయన సాక్షాత్కారం కోసం ఎన్నో యజ్ఞాలు, యాగాలు ఆచరించారు. వారికి కూడా పరమ దుర్లభమైన దర్శనం నాకు అవుతుంది. 
కాని నేను వెళ్ళగానే శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడో? శత్రువు పంపిన వేగునని తిరస్కరిస్తాడో, లేక శత్రువు మీద ఉన్న కోపం నామీద చూపి సంహరిస్తాడో? ఏదేమైనా శ్రీకృష్ణుడిని చూస్తాను.  అనుకుంటూ ఇంకెంత దూరం ఇంకెంతదూరం అంటూ వస్తూ ఉండగా గుర్రాలు అంత వేగంలో పరుగెడుతూ కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏంటి ఇలా ఆగిపోయాయని అని ముందు చుస్తే అడుగుల గుర్తులు ఉన్నాయి. ఎవరివి ఈ అడుగుల గుర్తులు అని పరిశీలనగా చుస్తే ఆ గుర్తుల్లో శంకు, చక్ర, గదా, శర్గజం అనే కోదండం ఇంకా ఇతర ఆయుధాల గుర్తులు ఉన్నాయి. ఆ ఐతే ఇప్పుడే కృష్ణుడు ఇటుగా వెళ్లినట్టు ఉన్నాడు. ఆహా ఈ అశ్వాలకి ఎంత శక్తి ఉంది! సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాద ముద్రలని గుర్తించి ఆ పాదాలు దాటకూడదు అని ఆగిపోయాయి. అని పరవశం చెంది క్రిందికి దిగి ఆ అడుగుల గుర్తులని ముద్దాడి శ్రీకృష్ణుడి అడుగుల గుర్తులున్న ఇసుకని వంటినిండా పూసుకున్నాడు. మళ్లి తెలివి తెచ్చుకుని అయ్యయ్యో పాదముద్రలు పాడైపోయ్యాయే! అయ్యో అనుకుంటూ లేచి ఇప్పుడే ఇటు వెళ్లినట్టు ఉన్నాడు. ఎక్కడ అని శ్రీకృష్ణుడు పాదగుర్తులు ఉన్నవైపు చుస్తే అల్లంతదూరంలో నీలివర్ణంలో, తలపై నెమలి పించంతో, చేతిలో పిల్లనగ్రోవితో, దివ్యతేజస్సుతో అన్నగారైన బలరాముడితో కలిసి గోవులదగ్గర నిలబడి ఉన్నాడు. ఆహా జన్మధన్యం అయిపొయింది అని పరుగుపరుగున వెళ్లి శ్రీకృష్ణుడి పాదాలపై సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడి వయస్సు 8సంవత్సరాలు కేవలం. శ్రీకృష్ణుడు చూసి అక్రూరుడితో మేము చిన్నవాళ్ళం. మీరు పెద్దవారు. ఇలా  మా పాదాలపై పడితే మాకు అయుక్షీణం కదా! మీకు ఏమైనా న్యాయమేనా ఇది. అన్నాడు. 
స్వామి మీముందు నేనెంత? చెట్లకి పుట్లకి వస్తాయి ఏళ్ళు. అలాగే నాకు వచ్చాయి. అవతారపురుషుడివి నువ్వు. అన్ని నీలోనే ఇమిడివున్నాయి. సృష్టి అంతటా వ్యాపించివున్నావు. చరాచర జగత్తుకి తండ్రివి నువ్వు. మిగిలునది తరువాత చెప్పుకుందాం.. 
Share:

Sunday, 17 November 2013

శ్రీకృష్ణ కథామృతం..

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.


      కంసుడు శ్రీకృష్ణుని మేనమామ అని తెలుసుకదా! దేవకీదేవి అష్టమ గర్భం లో జన్మించిన శిశువు నిన్ను చంపేస్తాడు అని కంసుడికి ఆకాశవాణి చెప్తుంది. ఆనాటి నుండి చిత్రవిచిత్రమైన పరిస్థితులలో శ్రీకృష్ణుడు యశోద వొడిలోకి చేరతాడు. ఇది కూడా చాలామందికి తెలుసుకదా!
శ్రీకృష్ణుడు తప్పించుకున్నాడని తెలిసి ఆనాటి నుండి చంపడం కోసం కంసుడు చేయని పనిలేదు. చంపడానికి ఎందరినో పంపించాడు. కాని వెళ్ళినవారు వెళ్తున్నారే గాని తిరిగిరవడంలేదు. చివరికి విసిగి ద్వారకలో ఉండే ఒకతనిని పిలిచి విషయం చెప్తాడు. నేను కృష్ణుడిని చంపాలని చాలా ప్రయత్నాలు చేశాను. అన్నీ విఫలమయ్యాయి. ఆలోచిస్తే ఒక మార్గం కనపడింది. నువ్వు వెళ్లి శ్రీకృష్ణుడితో మీ మేనమామ తన ధనస్సుకి పూజ చేస్తున్నాడు కాబట్టి నిన్ను బలరాముడిని వెంటబెట్టుకుని రమ్మన్నాడు. అని రధం ఎక్కించుకుని తీసుకురా! ఇక్కడికి అడుగుపెట్టిన మరుక్షణంలో ఆ ద్వారం దగ్గరే ఏనుగుతో తొక్కించి చంపేద్దాం. (ఈ ఏనుగు బాగా మదించిన ఏనుగు. ఒకేసారి 10000 ఏనుగుల్ని అవలీలగా చంపేస్తుంది. అంత బలం కలిగింది)  అని చెప్పాడు. 
ఆమాట వినడంతోనే మనసులో నవ్వుకుని! ప్రభువు చెప్పింది చేయడం నాకర్తవ్యం.  నా వంతు ప్రయత్నం చేస్తాను. అయన ఇక్కడికి వచ్చిన తరువాత జరగాల్సిందే జరుగుతుంది. (ఇక్కడ కంసుడు శ్రీకృష్ణుడితో పోరాడితే చనిపోతాడని తెలుసు. అందరికి ప్రభువు శ్రీకృష్ణుడే. ఇది అయన సంకల్పం అని గ్రహించి ఇలా మాట్లాడాడు. ఈ విషయం కంసుడుకి అర్ధం కాలేదు. ఆ తరువాత ఇలా ఎత్తులు వేస్తూ ఉన్నాడు.) కంసుడు  సంతోషించి పంపించాడు. ఇక ఆరోజు రాత్రి కంసుడికి నిద్రపట్టలేదు. ఆ వేగుకి కూడా నిద్రపట్టలేదు.  కంసుడు! శ్రీకృష్ణుడు రాగానే కోటగుమ్మం దగ్గర ఆ మాధగజేంద్రం తో చంపించేస్తాను. ఒకవేళ దాన్ని దాటుకుని వస్తే! నాదగ్గర కండలు తిరిగిన మల్లయోధులు వున్నారు. ఎంతోమంది యోధానుయోదులని చంపారు. ఇంకేందరినో ఓడించారు. వీళ్ళు చంపేస్తారు. ఒకవేళ వీళ్ళని కూడా దాటుకుని వస్తే సైన్యం ఉండనేవుంది. వీరి చేతుల్లో అయినా చనిపోతారు. ఒకవేళ వీరిని కూడా దాటి వస్తే నేను ఉన్నాను. అనుకుంటూ పడుకున్నాడు గాని నిద్రపట్టడంలేదు. ఎలాగో నిద్రపోయాడు. అప్పుడు భయంకరమైన కలలు వచ్చాయి. (అదేంటో తరువాత తెలుసుకుందాం)
Share:

శ్రీకృష్ణ కథామృతం..

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.


      కంసుడు శ్రీకృష్ణుని మేనమామ అని తెలుసుకదా! దేవకీదేవి అష్టమ గర్భం లో జన్మించిన శిశువు నిన్ను చంపేస్తాడు అని కంసుడికి ఆకాశవాణి చెప్తుంది. ఆనాటి నుండి చిత్రవిచిత్రమైన పరిస్థితులలో శ్రీకృష్ణుడు యశోద వొడిలోకి చేరతాడు. ఇది కూడా చాలామందికి తెలుసుకదా!
శ్రీకృష్ణుడు తప్పించుకున్నాడని తెలిసి ఆనాటి నుండి చంపడం కోసం కంసుడు చేయని పనిలేదు. చంపడానికి ఎందరినో పంపించాడు. కాని వెళ్ళినవారు వెళ్తున్నారే గాని తిరిగిరవడంలేదు. చివరికి విసిగి ద్వారకలో ఉండే ఒకతనిని పిలిచి విషయం చెప్తాడు. నేను కృష్ణుడిని చంపాలని చాలా ప్రయత్నాలు చేశాను. అన్నీ విఫలమయ్యాయి. ఆలోచిస్తే ఒక మార్గం కనపడింది. నువ్వు వెళ్లి శ్రీకృష్ణుడితో మీ మేనమామ తన ధనస్సుకి పూజ చేస్తున్నాడు కాబట్టి నిన్ను బలరాముడిని వెంటబెట్టుకుని రమ్మన్నాడు. అని రధం ఎక్కించుకుని తీసుకురా! ఇక్కడికి అడుగుపెట్టిన మరుక్షణంలో ఆ ద్వారం దగ్గరే ఏనుగుతో తొక్కించి చంపేద్దాం. (ఈ ఏనుగు బాగా మదించిన ఏనుగు. ఒకేసారి 10000 ఏనుగుల్ని అవలీలగా చంపేస్తుంది. అంత బలం కలిగింది)  అని చెప్పాడు. 
ఆమాట వినడంతోనే మనసులో నవ్వుకుని! ప్రభువు చెప్పింది చేయడం నాకర్తవ్యం.  నా వంతు ప్రయత్నం చేస్తాను. అయన ఇక్కడికి వచ్చిన తరువాత జరగాల్సిందే జరుగుతుంది. (ఇక్కడ కంసుడు శ్రీకృష్ణుడితో పోరాడితే చనిపోతాడని తెలుసు. అందరికి ప్రభువు శ్రీకృష్ణుడే. ఇది అయన సంకల్పం అని గ్రహించి ఇలా మాట్లాడాడు. ఈ విషయం కంసుడుకి అర్ధం కాలేదు. ఆ తరువాత ఇలా ఎత్తులు వేస్తూ ఉన్నాడు.) కంసుడు  సంతోషించి పంపించాడు. ఇక ఆరోజు రాత్రి కంసుడికి నిద్రపట్టలేదు. ఆ వేగుకి కూడా నిద్రపట్టలేదు.  కంసుడు! శ్రీకృష్ణుడు రాగానే కోటగుమ్మం దగ్గర ఆ మాధగజేంద్రం తో చంపించేస్తాను. ఒకవేళ దాన్ని దాటుకుని వస్తే! నాదగ్గర కండలు తిరిగిన మల్లయోధులు వున్నారు. ఎంతోమంది యోధానుయోదులని చంపారు. ఇంకేందరినో ఓడించారు. వీళ్ళు చంపేస్తారు. ఒకవేళ వీళ్ళని కూడా దాటుకుని వస్తే సైన్యం ఉండనేవుంది. వీరి చేతుల్లో అయినా చనిపోతారు. ఒకవేళ వీరిని కూడా దాటి వస్తే నేను ఉన్నాను. అనుకుంటూ పడుకున్నాడు గాని నిద్రపట్టడంలేదు. ఎలాగో నిద్రపోయాడు. అప్పుడు భయంకరమైన కలలు వచ్చాయి. (అదేంటో తరువాత తెలుసుకుందాం)
Share:

Saturday, 16 November 2013

యుగతత్వం

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.

    కాలపురుషుడు కాలం నడిపించడం కోసం బ్రహ్మ ఆజ్ఞాపించగా, తన దేవేరితో కలిసి నలుగురు సంతానాన్ని పొందాడు. వారిలో మొదటివాడు సత్యయుగుడు, రెండోవాడు త్రేతా, మూడవవాడు ద్వాపర, నాల్గవవాడు కలిపురుషుడు.

ఇందులో సత్యయుగుడు తెల్లని వర్ణంలో ఉన్నాడు. త్రేతాయుగుడు ఆకుపచ్చని వర్ణంలో, ద్వాపరుడు ఎరుపు వర్ణంలో, కలి అయ్యప్ప మాలలు వేస్తారు కదా ఆ బట్టల రంగులో వున్నాడు.
మొదటివాడు మౌనంగా ఉన్నాడు. రెండోవాడు కొద్దిగా మాట్లాడాలి కనుక మాట్లాడాడు. మూడోవాడు అన్న మాట్లాడుతున్నాడు కదా అని మాట్లాడుతున్నాడు. నాలుగవవాడు లోడలోడా మాట్లాడేస్తున్నాడు.
నాలుగోవాడు! నన్ను కన్నావు నాకు ఇల్లు కావలి, ఎకరం పొలం కావలి, చేయడానికి పని కావాలి, బ్రతకడానికి ఆస్థి కావాలి. కావలి! కావాలి! కావలి! అని తెగ గోల గోల చేస్తున్నాడు. దీనితో విరాట్ కి విసుగొచ్చింది. ఇప్పటివరకు పిల్లలు లేరు అనుకున్నాను. పిల్లలు వచ్చేసరికి గోల గోల ఏంటి? అనుకుని వీడితో పడలేకపోతున్నా అని! ఒక నిస్సారమైన భూమిని, ఒక ఇంటిని, లవణ సముద్రాన్ని ఇచ్చి ఇవ్వు ఇవ్వు అన్నావు కదా తీసుకో అని కలికి ఇచ్చి వెళ్ళమన్నాడు. (తల్లిదండ్రులని పీదించెవారు. కోర్టులో దావాలు వేసి ఆస్థులు గెలుచుకునే ప్రభుద్దులు ఉంటారు కదా! వారికి దక్కేది ఇలాంటి దిక్కుమాలిన ఆస్తులే. గెలుచుకున్నాం అనే పేరు మాత్రమే ఉంటుంది.)
మూడో వాడు! నాన్నగారు తమ్ముడికి ఇచ్చారు మరి నాకు ఇవ్వరా? అడగలేదనుకుంటారని ఊరుకుకోకండి. అన్నాడు. వీడికి మంచినీటితో ఉన్న సముద్రాన్ని ఇచ్చాడు. కొద్దో గొప్పో పండే భూమిని ఇచ్చాడు. మంచి సుందరమైన ఇంటిని కట్టి ఇచ్చాడు. ఇంతలో పనికూడా చూపించండి అన్నాడు ద్వాపరుడు. మీ తమ్ముడు కంటే ముందే నీకు ఇస్తాను. నీకు ఇచ్చిన తరువాతే మీ తమ్ముడికి అన్నాడు. ఇచ్చినవి తీసుకుని ద్వాపరుడు వెళ్ళిపోయాడు.
ఇక రెండోవాడు! నాన్నగారు ఇలా అడుగుతున్నాను అని ఏమి అనుకోకండి. నాకు కూడా ఏదైనా దారి చూపించండి. ఇబ్బంది లేకపోతేనే అన్నాడు వినయంగా. ఇంత వినయంగా అడిగావు కనుక నీకు పాల సముద్రం, మంచి ఆవులు, మంచి పంట భూములు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. సంతోషించి తీసుకుని త్రేతుడు కూడా వెళ్ళిపోయాడు.
ఇక మిగిలింది ద్వాపరుడు! ఈసారి తండ్రే అడిగాడు. నాయనా సత్య! ఎవరికీ వారు అడిగి తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వేమిటి మౌనంగా ఉన్నావు. ఏమి వద్దా? ఏమికావలో అడుగునయనా! అనగానే!
నాన్నగారు! ఈ శరీరం మీరు ఇచ్చింది. నేను ఎవరిని అడగడానికి. ఈ శరీరంతో మీకు ఏది కావాలో అది చేయించుకోండి. అడిగే అర్హత నాకు లేదు. మీ ఇష్టం నాన్నగారు. మీరు ఏది చెపితే అది చేస్తాను అనగానే. తండ్రి సంతోషించి పుత్రుడివి అంటే నువ్వే. కాబట్టి నీకు అమృతం ఇస్తున్నాను తీసుకో అని అమృతం ఇచ్చాడు.

ఇదే కాల ప్రభావం. నాలుగు యుగముల తీరు తెన్నులు. సత్య యుగంలో 4పాదాలు ధర్మం వుంది. ధర్మం తప్ప ఇంకొకటి లేదు. ఎవరిదైనా నగ పొతే ఇంటికి వెళ్లి ఇచ్చేవారు. త్రేతాయుగంలో ఒకపాదం తగ్గింది. చాటింపు వేస్తె నగ పోయినవారు వచ్చి తీసుకెళ్ళేవారు. చాటింపు వేసినందుకు ఎంతోకొంత ద్రవ్యం తీసుకునేవారు. ద్వాపరయుగంలో రెండు పాదాలు తగ్గాయి. సగానికి సగం తీసుకుని ఇచ్చేవారు. ఈ మూడు యుగాల్లో పోయిన వస్తువు ఏదో ఒక రూపంలో యజమానికే చేరేది. ఇక కలియుగంలో 3పాదాలు తగ్గి ఏదైనా దొరికితే ఎవరుచుడటం లేదు కదా అని చటుక్కున తీసుకుని లటుక్కున జీబులో వేసుకునేవారు 90% పెరిగిపోయారు.
దీనికితోడు అలసత్వం, సోమరితనం, బుద్దిమాన్యులు, అల్పాయుష్కులు. రోగపీడితులు.
Share:

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com