..

  • This is featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

Monday, 3 October 2016

గంగానది పుట్టు పూర్వోత్తరాలు


        నదులు పుట్టుక ప్రకృతి పై ఆధారపడి వర్షాధారముగానో , మంచు కొండలలోని మంచు కరగడము వలనో చిన్న పాయలు , వాగులు , సెలయేళ్ళు కలయిక వలన పల్లపు ప్రంతాలకు ప్రవహించడము వలన యేర్పడుతూ ఉంటాయి. ఇది ప్రకృతి సహజము . కాని మన హిందూ పురాణాలలో వ్యాసమహర్షి రచనలవలన అంతా దైవకృపవలనే జరిగినట్టుగా వ్రాయబడినది . కదో , నిజమో చరిత్ర కారులకే తెలుస్తుంది . ప్రస్తుతానికి ఇది ఒక పురాణ కధగానే చెప్పుకుంటున్నాము .

"గంగాధరా హర హర నమో" అని శివుణ్ణి ప్రార్ధిస్తాము . గంగను ధరించిన ఓ శివా నీకు నమష్కారము అని అంటాం. మరి ఆ గంగాదేవి ఎప్పుడు అవతరించినట్లూ , అంటే అందుకో పౌరాణిక కధ ఉంది. గంగాదేవికి అత్యంత ఇష్టమైన రోజూ , ఆమె ను అంతా పూజించవలసిన రోజూ ఏదంటే ... ఆ రోజే " గంగా సప్తమి " అనగా వైశాఖ శుక్లపక్ష సప్తమి -- గంగా సప్తమి .

కధ :
ఒకప్పుడు సగరుడు అనే సూర్యవంశ రాజు ఉండేవాడు . సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సాగరరాజు అశ్వమేథ యాగం చేయతలపెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి, కుయుక్తితో దానిని కపిల మాహర్షి దగ్గర కట్టి వేశాడు. ఆ దృశ్యాన్ని తిలకించిన యువ రాజులు కపిలుడే దానిని బంధించాడని భావించి, ఆయనను ఘాటుగా విమర్శించారు. అందుకు ఆగ్రహించిన ఆ ఋషి రాజకుమారులందరినీ భస్మంగా మారుస్తాడు.

సాగర చక్రవర్తి రెండవ భార్య కుమారుడు అసమంజ.అసమంజుని కొడుకు అంశుమానుడు..
పినతండ్రుల జాడ వెతుకుతూ అక్కడికి చేరుకుంటాడు. చుట్టూ బూడిదకుప్పలు. విషయం అర్థమైపోతుంది.అంసుమాన్‌ తమ తప్పును క్షమించి శాంతించమని ఆ ఋషిని వేడుకున్నాడు. దాంతో శాంతించిన రుషి... దేవలోకం నుండి గంగను భూమి మీదకు తేగలిగితే, రాకుమారుల ఆత్మలు శాంతిస్తాయన్నారు.. అరవైవేల పాపాల్ని ఒక్కదెబ్బతో కడిగేయగల శక్తి గంగకే ఉందని సలహా ఇస్తాడు గరుత్మంతుడు. సగరుడి తరం ముగుస్తుంది. అంశుమానుడి తరం ముగుస్తుంది. దిలీపుడి తరం ముగుస్తుంది. గంగను రప్పించడం ఎవరితరమూ కాదు. భగీరథుడి పాలన వెుదలవుతుంది. భగీరథ ప్రయత్నమూ వెుదలవుతుంది. అతని ఘోరతపస్సుకు మెచ్చి, బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని స్పష్టంచేస్తాడు. మధ్యలో ఓ మజిలీ అవసరమవుతుంది. పరమశివుడికే ఆ సామర్థ్యం ఉందంటాడు. భగీరథుడు శివుడ్ని ప్రార్థిస్తాడు. గంగను నెత్తినెక్కించుకోడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు..శివుడి జటాఝూటాల్లోంచి... గంగావతరణ వెుదలవుతుంది.

శివుడినెత్తిన ఉన్న సురగంగ...
హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని పాయలుగా తాకుతుంది. తూర్పువైపున... హ్లాదిని, పావని, నళిని. పశ్చిమం దిక్కున... సుచక్షు, సీత, సింధు. వెుత్తం ఆరుపాయలు. ఏడోపాయ మాత్రం భగీరథుడి రథం వెనకాలే పరిగెడుతుంది. దార్లోనే జహ్ను మహర్షి ఆశ్రమం.ఆ ప్రవాహానికి తాటాకు గుడిసెలన్నీ కొట్టుకుపోతాయి. మహర్షి ఆగ్రహోదగ్రుడవుతాడు. గంగను దోసిట్లో పట్టేసుకుని తీర్థంలా తాగేస్తాడు. ఆ బందిఖానా నుంచి విడుదలచేయమని అంతా వేడుకుంటారు. లోకకల్యాణార్థం మహర్షి సరేనంటాడు. చెవిలోంచి బయటికి వదిలేస్తాడు. ఎత్తుపల్లాల్ని దాటుతూ... ఎగుడుదిగుడుల్ని అధిగమిస్తూ... అపుడపుడూ ఉద్ధృతంగా... అక్కడక్కడా మందగమనంతో... ప్రవహించి ప్రవహించి భరతఖండాన్ని పావనం చేస్తుంది పుణ్యాల గంగ.

భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయ్యింది. జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది. నింగి, నేల, పాతాళం-మూడులోకాలు. తూర్పు, పడమర, దక్షిణం-మూడు దిక్కులు. ముచ్చటగా మూడువైపులా పారి, 'త్రిపథగ' అన్న పేరునూ సార్థకం చేసుకుంది. ఆ ప్రవాహం పుణ్యమాని సగరులు ముక్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మానవులు పరవశించారు. జలచరాలు జయజయధ్వానాలు చేశాయి. పచ్చని
పంటలు ప్రాణంపోసుకున్నాయి. భూమి స్వర్గమైంది. ఆ వైభోగం ముందు, అసలు స్వర్గం చిన్నబోయింది. గంగ భూమికి దిగొచ్చినరోజే, మకర సంక్రాంతి!

క్రాంతి అంటే మార్పు. భరతజాతి చరిత్రలో గంగావతరణాన్ని మించిన, గొప్ప మార్పేముంది? వ్యవసాయిక దేశంలో జలవనరులు నిండుగా మెండుగా పొంగిపొర్లిన నాడే నిజమైన పండగ. అందుకే, పచ్చని పంటలిచ్చిన గంగమ్మ ప్రత్యక్ష దైవమైంది. ఆ ఒడ్డునే పుణ్యక్షేత్రాలు వెలిశాయి. నగరాలు పుట్టాయి. సామ్రాజ్యాలు ప్రాణంపోసుకున్నాయి. నాగరికత పరిఢవిల్లింది. దివిగంగ భువికి దిగివచ్చిన తీరు అద్భుతం. అదో అపురూప ఘట్టం. 'రఘువంశం'లో కాళిదాసు పదప్రవాహం గంగాఝరిని గుర్తుకుతెచ్చింది. ఉత్పలవారి 'గంగావతరణం' మాత్రం తక్కువా?

'హృషీకేశ హరిద్వార రుష్యాశ్రమ ముక్తేశ్వర పుణ్యపదములెల్ల దాటి పొంగులెత్తి వచ్చెగంగ!'
...ఆ పద్యపాదాల్లో గంగమ్మ అడుగుల సవ్వడి వినిపిస్తుంది. బాపురమణల 'సీతాకల్యాణం'... గంగావతరణను వెండితెర మీద హృద్యంగా ఆవిష్కరించింది. సినారె ఆ క్రతువుకు కలంసాయం అందించారు. రవివర్మ నుంచి వడ్డాదివారి దాకా... ఎంతోమంది చిత్రకారులు ఆ అద్భుత దృశ్యానికి రంగులద్దారు.

మహాబలిపురంలోని గంగావతరణ శిల్పం... రాతితో మలచిన రమణీయ కావ్యం. కెవిన్‌ పెర్ష్‌ అనే ఆస్ట్రేలియా చిత్రకారుడైతే... ఆరేళ్లు శ్రమించి, వెుత్తం 21 చిత్రాలలో గంగాప్రవాహాన్ని కాన్వాస్‌ మీద సృష్టించాడు. 'ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి వేయి బొమ్మలైనా సరిపోవు. వంద రంగులున్నా చాలవు. నా ప్రయత్నం చంద్రుడికో నూలుపోగే' అని వినయంగా చెప్పుకున్నాడు కెవిన్‌.

ఆది గంగ...
గంగ పుట్టుక వెనుకా ఓ ఐతిహ్యం ఉంది. వామనుడు మూడడుగుల నేల అడిగాడు. బలి సవినయంగా సమర్పించుకున్నాడు. ఒక అడుగు భూమిని ఆక్రమించింది. రెండో అడుగు...ఇంతై ఇంతింతై బ్రహ్మలోకం దాకా విస్తరించింది. సాక్షాత్తు విష్ణుమూర్తి పాదం... గడపదాకా రావడమంటే, ఎంతదృష్టం! భక్తితో కాలు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. ఆ తీర్థమే... సురగంగగా అవతరించింది. భగీరథుడి కృషితో భూలోకానికి వచ్చింది. భారతీయుల హృదయగంగై ప్రవహించింది. భూగోళశాస్త్ర పరంగా చూసినా... గంగ ఇప్పటిది కాదు. వేదకాలం నాటికే ప్రవహించింది. కానీ అప్పట్లో సింధు, సరస్వతి నదులకే ప్రాధాన్యం.
రుగ్వేద రుక్కులు ఆ రెండు నదుల్నే కీర్తించాయి. ఓచోట 'గంగ' ప్రస్తావన ఉన్నా, ఆ మాట నీటికి సంబంధించిందో, ఏటికి సంబంధించిందో స్పష్టంగా తెలియదు. రుగ్వేదానంతర కాలంలో గంగ ప్రాధాన్యం పెరిగింది. వేదర్షులు గంగానదిని 'జాహ్నవి' అని పిలిచారు. రామాయణం నాటికి గంగకు పూజనీయ స్థానం లభించింది.

రామావతారంలో తాను గంగానది ఒడ్డునే పుడతానని విష్ణువు దివిజగంగకు మాటిచ్చాడు. సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు గుహుడు దాటించింది గంగానదినే. ఇక భారతమైతే గంగ ప్రవేశంతోనే గొప్ప మలుపు తిరుగుతుంది. శంతన మహారాజు అద్భుత సౌందర్యరాశి అయిన గంగ మీద మనసుపడతాడు. వరాలిచ్చి మనువాడతాడు. ఆ జంటకు పుట్టిన బిడ్డే భీష్మపితామహుడు. మిగిలిన భారతమంతా మనకు తెలిసిందే. చరిత్రలో గంగ
ప్రాధాన్యం విస్మరించలేనిది. మహామహా రాజ్యాలన్నీ గంగ ఒడ్డునే వెలిశాయి. సారవంతమైన గంగ-యమున పరీవాహక ప్రాంతంపై ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలు జరిగాయి.

జల సాక్షి...
నదీ తీరాల్లో నాగరికతలు పుట్టాయి. అంతరించాయి. రాజ్యాలు వెలిశాయి. మట్టికొట్టుకుపోయాయి. నదులు వర్తకవాణిజ్యాలకు కేంద్రాలయ్యాయి. పుణ్యక్షేత్రాలకు నిలయాలయ్యాయి. పాడిపంటలకు మూలమయ్యాయి. మనిషి మనుగడను మలుపుతిప్పిన నదీనదాలు చాలానే ఉన్నాయి. కానీ, అవన్నీ గంగానదులు కాలేకపోయాయి. భారతీయుల హృదయాల్లో గంగకున్న స్థానం వేరు. పుట్టుక నుంచి కట్టకడదాకా, ఆమాటకొస్తే మరణం తర్వాత కూడా... భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి. బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగతీర్థం పోయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. బిడ్డకు చేయించే తొలి స్నానం గంగాజలంతోనే. 'గంగేచ, యమునేచైవ గోదావరీ సరస్వతీ...' అంటూ పెద్ద ముత్తయిదువలు గంగమ్మను గంగాళంలోకి ఆహ్వానిస్తారు. ఆ పిలుపు వినిపించగానే, సర్వనదుల ప్రతినిధిగా... సురగంగ బిరబిరా తరలివస్తుంది.
కార్డు మీద పిన్‌కోడ్‌ నంబరు వేయకపోతే, పోస్టుమాస్టరుగారికి చిర్రెత్తుకొస్తుంది. సరైన చిరునామాలో అందించడానికి ఆ అంకెలు చాలా అవసరం.
సృష్టిమాస్టారుగారి పిన్‌కోడ్‌... గంగ! గంగా పరీవాహక ప్రాంత ప్రజలు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు... తాము గంగకు ఏ దిక్కున ఉన్నారో పరమాత్మకు విన్నవించుకోవాలి. లేదంటే, ఆ వెుర దేవరకు చేరదు. భారతీయులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా మునిగితీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగానది ఒకటి. ఆ స్పర్శతో సకలపాపాలూ హరించుకుపోతాయన్న నమ్మకం. అందుకే పితృదేవతలు పైలోకాల్లోంచి మనం గంగలో ఎప్పుడు మునకలేస్తామా అని ఎదురుచూస్తుంటారట. జీవిత చరమాంకంలో, మృత్యుఘడియ దగ్గరపడుతున్నప్పుడు... శ్వాస సహకరించకున్నా, గొంతు పెగలకున్నా, మాట
తడబడుతున్నా ఎక్కడలేని శక్తిని కూడదీసుకుని 'గంగ...' పోయమని అర్థిస్తాడు జీవుడు. తులసి కలిసిన ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే నేరుగా పుణ్యలోకాలకు చేరుకుంటామన్న నమ్మకం.

మహాభారతంలో... అంపశయ్య మీది నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు. ఒక్క గంగాస్నానంతో... యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం, పూజలూ వ్రతాలూ చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి. గంగ తగిలితే చాలు... అటు ఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ పవిత్రమైపోతాయట. గంగ లేని దేశం... సోమం లేని యజ్ఞమట! చంద్రుడు లేని రాత్రిలాంటిదట. పూలు పూయని చెట్టులాంటిదట. 'ఇన్ని మాటలెందుకు కానీ, గంగ గొప్పదనం చెబుతూ పోతే, సముద్రంలో నీటి కణాల్ని లెక్కపెట్టినట్టే ఉంటుంది' అంటాడు భీష్మపితామహుడు! గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ ఉన్నాయి. ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకేనేవో, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నవారి గొంతులో చిటికెడు గంగ పోస్తారు.
గంగానదిలోని కొన్నిరకాల సూక్ష్మక్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన వెుక్కల్నీ వనమూలికల్నీ తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అన్నిటికీ మించి, గంగ మీదున్న నమ్మకం, అచంచలమైన భక్తి..ఆ నీటికి అంత మహత్తునిచ్చింది.

జ్ఞానవాహిని..
గంగ... జ్ఞానగంగ! ఆ గాలి ప్రభావంతో, ఆ తీర్థ మహత్యంతో... ఎన్నో జీవితాలు మారాయి. చికట్లు తొలగిపోయాయి. అజ్ఞానం పటాపంచలైంది. అహం మంచులా కరిగిపోయింది. ఓరోజు శంకర భగవత్పాదులవారు గంగానదిలో స్నానానికి వెళ్తున్నారు. నాలుగు శునకాలతో చండాలుడు ఎదురొచ్చాడు. 'స్వామివారొస్తున్నారు. పక్కకు తప్పుకో' అని హెచ్చరించారు శిష్యులు. 'పక్కకు జరగమంది ఈ శరీరాన్నా? శరీరంలోని ఆత్మనా? అప్పుడది ద్వైతమే కానీ, అద్వైతం కాదే' అని వాదిస్తాడు చండాలుడు. కాదుకాదు, చండాలుని రూపంలోని పరమశివుడు. గంగమ్మ సాక్షిగా శంకరుడికి జ్ఞానబోధ అవుతుంది. కర్తవ్యోపదేశం జరుగుతుంది. గంగ మనసు వెన్న. పిలిస్తే పలుకుతుంది. అర్థిస్తే కరుణిస్తుంది. తెలుగు కవి పండితరాయలే ఆ మంచితనానికి ప్రత్యక్ష సాక్షి. 'గంగాలహరి' రాసిన పరమభక్తుడాయన. చివరి రోజుల్లో గంగలో ఐక్యం కావాలనుకున్నాడు. ఒడ్డున నిలబడి 'గంగాలహరి' పాడుతుంటే...ఒక్కో శ్లోకం పూర్తవుతుంటే, ఒక్కో అడుగూ ముందుకొచ్చి... ఆ కవిరాయలను తనలో కలిపేసుకుంది గంగ. ఇప్పటికీ, గంగానదికి పండితరాయల శ్లోకాలతోనే హారతులిస్తారు. ఇది, తెలుగువారికి గంగమ్మ మీదున్న భక్తికి నిదర్శనం. గంగమ్మకు తెలుగువారి మీదున్న ప్రేమకు తార్కాణం. ముక్తినిచ్చే తల్లి భుక్తిని మాత్రం ఇవ్వకుండా ఉంటుందా? గంగ, దాని ఉపనదుల పుణ్యమాని పరీవాహక ప్రాంతమంతా పచ్చదనమే. వరి, మిరప, చెరకు, జనపనార... తదితర పంటలు పుష్కలంగా పండుతాయి. పర్యాటకులతో పుణ్యక్షేత్రాలతో కళకళలాడే ఆ నదీతీరాలు... ఎంతోమందికి ఉపాధినిస్తున్నాయి. ఎన్నో పరిశ్రమలకు గంగనీరే దిక్కు. గంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఎక్కడో దేవలోకంలో పుట్టిన గంగ నలుగురి కోసం నేలకు దిగింది. పంటలకు నీరిచ్చింది. మనుషులకు పంటలిచ్చింది. జలచరాలకు ప్రాణమిచ్చింది. ఎంత మంచితనం, ఎంత త్యాగగుణం!

పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం ఎలాగో గంగను చూసే నేర్చుకోవాలి. ఉద్ధృత గంగా ప్రవాహం... అవసరాన్ని బట్టి అక్కడక్కడా మందగిస్తుంది. పరిస్థితులకు తలవొగ్గి, నిశ్శబ్దంగా ముందుకెళ్తుంది. నదీప్రవాహంలోనే కాదు, జీవన ప్రవాహంలోనూ పట్టువిడుపులుండాలన్న గొప్పపాఠమది. గంగ స్నేహానికి ప్రాణమిస్తుంది. ఎలాంటి ప్రాశస్త్యమూ లేని మామూలు వాగుల్నీ వంకల్నీ చిన్నాచితకా నదుల్నీ ప్రేమగా తనలో కలిపేసుకుంది. వాటికి పవిత్రతను కల్పించింది.
సజ్జన సాంగత్యంలోని గొప్పతనమే అది. ఇక యమునకైతే అర్ధ సింహాసనాన్నిచ్చి గౌరవించింది. రెండు మతాలు, రెండు ప్రాంతాలు, రెండు జాతులు, ఇద్దరు వ్యక్తులు... ఒక్కటిగా ఉండాలని చెప్పిన ప్రతిసారీ గంగాయమునల సంగమాన్నే గుర్తుచేసుకుంటాం. నిజానికి గంగ కంటే, యమున భౌతికంగా శక్తిమంతమైంది. ఉద్ధృతమైంది. కానీ గంగకున్న ఆధ్యాత్మికశక్తి ముందు, త్యాగమయమైన చరిత్రముందు యమున సవినయంగా తలవంచింది. అందుకే అది 'యమునాగంగ' సంగమం కాలేదు. 'గంగాయమున' సంగమమే అయ్యింది.

రామ్‌ తేరీ గంగా మైలీ...
మనిషి భస్మాసుర అంశ. లేకపోతే, వరాలతల్లికే ఉరిబిగిస్తాడా? దిగివచ్చిన దేవతనే అవమానిస్తాడా? వెర్రులెత్తిన స్వార్థంతో గంగనే మింగేస్తాడా? వ్యర్థాల్నీ రసాయనాల్నీ కాష్ఠాల్నీ కాలుష్యాల్నీ భరించలేక జాహ్నవి బేజారెత్తిపోయింది. పరిశ్రమల వ్యర్థాల కారణంగా ఎప్పటి నుంచో గంగమ్మనే నమ్ముకున్న వేలవేల జలచరజాతులు కనుమరుగు అవుతున్నాయి. పెళ్లీపేరంటాల్లో పట్టుపావడాలతో గెంతులేసే అమ్మాయిల్లా... గంగానదిలో సందడిచేసే డాల్ఫిన్లు...మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. కబ్జాలూ ఆక్రమణలూ ప్రవాహ గతినే మార్చేస్తున్నాయి. హద్దులు దాటిన భక్తి భక్తే కాదు. అది మూఢత్వం. వేలకొద్దీ దహనాలతో అమృతగంగ మృతకళేబరాలకు నిలయమైపోయింది. గంగలో కలుపుతున్న పూలూ అస్తికలూ బూడిదలూ... జీవరాశినిబలిగొంటున్నాయి.

మరింత కాలుష్యాన్ని పోగుచేస్తున్నాయి. ఇది చాలదన్నట్టు...ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు. ఒకప్పుడు, సకలరోగాల నుంచి విముక్తి కలిగించిన ఔషధ గంగ... ఇప్పుడు, సర్వరోగాలకూ కారణం అవుతోంది. ఈ దుస్థితిని చూడలేక, ఆ దుర్వాసన భరించలేక నదీమతల్లిని దేవతగా ఆరాధించే భక్తుల కళ్లలో గంగ పొంగుకొస్తోంది. ఇంకో పుష్కరం వస్తోందంటే, ఇంకెంత చెత్త పోగవుతుందో అని భయపడాల్సిన పరిస్థితి.

భాగీరథీ సుఖదాయినీ మాతా
తవ జల మహిమా నిగమే ఖ్యాతా
నాహం జానే తవ మహిమా
పాహి కృపామయీ మమాజ్ఞానమ్‌
'గంగమ్మా! వరాలిచ్చే చల్లని తల్లీ!


నీ పవిత్రతను వేదాలు కీర్తించాయి. ప్రపంచమంతా కొనియాడింది. కానీ అవేవీ తెలియని అజ్ఞానులం మేం. నిన్ను కాలుష్యకాసారంగా మార్చినందుకు క్షమించు' అని లెంపలేసుకోడానికి పుష్కరమే సరైన సమయం. పశ్చాత్తాపం మనసులోని మాలిన్యాల్ని కడిగేస్తుంది. గంగాజలాల శుద్ధికి కూడా అదే సత్సంకల్పం.

గంగ...శుభ్రంగా!
వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ ప్రకారం...ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యానికి గురైన పది నదుల్లో గంగ ఒకటి. దాదాపు 30 నగరాల మురుగు, 25 పట్ణణాల కాలుష్యం, వేలకొద్దీ గ్రామాల వ్యర్థాలు... అంతా కలిసి దాదాపు మూడువేల మిలియన్‌ లీటర్ల చెత్తాచెదారం గంగలో కలుస్తోంది. గంగానదిలోంచి కాలుష్యాన్ని తరిమేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలే చేశాయి. న్యాయస్థానాలు కూడా బాగానే వెుట్టికాయలు వేశాయి. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 'గంగా యాక్షన్‌ ప్లాన్‌' కింద నదీజలాల శుద్ధికి దాదాపు వేయి కోట్లు ఖర్చుచేశారు. అయినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. తాజాగా పర్యావరణ మంత్రిత్వశాఖ 43 ప్రాజెక్టుల కింద రూ.2,400 కోట్లు మంజూరు చేసింది. ఈ వెుత్తంతో గంగానది అధికంగా కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాల్లో ... నీటిశుద్ధి ప్లాంట్లు, మురుగునీటి కాలువలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. 2020 నాటికంతా గంగానదిని స్వచ్ఛంగా తయారుచేయాలన్నది జాతీయ గంగా పరీవాహక సంస్థ ఆశయం. దీనికి సాక్షాత్తు ప్రధానమంత్రే నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి కూడా భారీవెుత్తంలో సాయం అందబోతోంది. ఎలాగైనా సరే, గంగను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఏడు ఐఐటీలకు చెందిన నిపుణులతో ఓ బృందం ఏర్పాటైంది. ఏ కార్యక్రమ విజయానికైనా నిధులొక్కటే ప్రధానం కాదు... ప్రజా భాగస్వామ్యం ఉండాలి. పాలకుల చిత్తశుద్ధి ముఖ్యం. గంగ విషయంలో ఈ రెండే కరవవుతున్నాయి.

గంగా ప్రవాహం.

గంగోత్రి హిమనీనదంలో పుట్టిన భగీరథి దేవ ప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి... 'గంగ' అవుతుంది. హరిద్వార్‌ దగ్గరికొచ్చి... జనగంగ అవుతుంది. కోసి, గోమతి, శోణ తదితర నదులు ప్రవాహ మార్గంలో కలుస్తాయి. అలహాబాద్‌ దగ్గర యమున తోడవుతుంది. ఆ తర్వాత ఎన్నో చిన్నాపెద్దా నదులు గంగలో కలిసి ఉద్ధృతిని పెంచుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా దగ్గర గంగ వెుదటిసారి చిలుతుంది. అక్కడి నుంచే గంగానది చిలిక... హుగ్లీనది వెుదలవుతుంది. ప్రధాన గంగను... మాల్దా తర్వాత పద్మానది అంటారు. బంగ్లాదేశ్‌లో ప్రవేశించాక, బ్రహ్మపుత్ర చిలిక అయిన జమునానది ఇందులో కలుస్తుంది. ఆతర్వాత మేఘన జతవుతుంది. ఆతర్వాత ఎన్నో చిలికలుగా ప్రవహించి... బంగాళాఖాతంలో కలుస్తుంది.

గంగా నది పుష్కర వైభవం

పన్నెండేళ్లకోసారి వచ్చే పెద్దపండగకు గంగానది సిద్ధమవుతోంది. ఆ పన్నెండురోజులూ గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలు పుష్కరశోభతో కళకళలాడతాయి. అసలు పుష్కరాలెందుకు? వాటి ప్రాశస్త్యం ఏమిటి? ... అదంతా ఓ పెద్ద కథ. పూర్వం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేశాడు. భక్తవశంకరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. పుష్కరుడు మణులో మాణిక్యాలో అడగలేదు. రాజ్యాలూ సామ్రాజ్యాలూ ఆశించలేదు. జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి. నదులు పునీతమైతే దేశమూ సుభిక్షంగా ఉంటుందని ఆ సత్పురుషుని ఆలోచన. అందుకే, 'దేవా... నా శరీర స్పర్శతో సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు' అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు 'నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఆ నదిలో స్నానమాచరించిన వారు పాపవిముక్తులవుతారు. జన్మరాహిత్యాన్ని పొందుతారు' అని వరమిచ్చాడు. పుష్కరుడు సంతోషించాడు. పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు(బృహస్పతి) తనకూ పుష్కరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను అడిగాడు. అందుకు పుష్కరుడు అడ్డుచెప్పాడు. ఇద్దరికీ నచ్చజెప్పి సమాన ప్రాతినిధ్యం కల్పించాడు బ్రహ్మ. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగా, చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు.

గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో, గంగ పుష్కరాలు వెుదలవుతాయి. ఆ ప్రకారం మే 8 నుంచి 19 దాకా... గంగకు పుష్కర మహత్తు వస్తుంది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానంచేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి.

ప్రతి మనిషి ఒంట్లో ఉండే మూడొంతుల నీరు గంగే. ఉద్వేగం పెల్లుబికినప్పుడు, జలజలా కారే కన్నీరు గంగే. కాయకష్టం చేసినప్పుడు, బొటబొటా రాలే చమటబిందువు గంగే! పూజారి చేతి పవిత్ర తీర్థం గంగ. ఆకాశంలోంచి కురిసే చిన్ని చినుకు గంగ. పాతాళంలోంచి పొంగే జలధార గంగ. గంగ... వేదాల్లో ఉంది. ఉపనిషత్తుల్లో ఉంది. రామాయణంలో ఉంది. భారతంలో ఉంది. భాగవతంలో ఉంది. భగవద్గీతలో ఉంది. అనగనగా కథల్లో ఉంది. జానపద గాథల్లో ఉంది. పల్లెపాటల్లో ఉంది. పామరుల నమ్మకాల్లో ఉంది. అయినా, గంగ లేనిదెక్కడ? పుట్టింది హిమాలయాల్లో అయినా, మెట్టింది బికారి శివయ్యనే అయినా... గంగ సమస్త భారతీయుల హృదయగంగ. గంగ అంతర్వాహిని. గంగ అనంతవాహిని.

రోజుకు పాతిక లక్షల మంది గంగలో మునుగుతారు. రోజుకు కోటిమంది పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటారు. 'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా'లో నెహ్రూ ఎంతగొప్ప మాటన్నారు... 'గంగ పుట్టింది వెుదలు సముద్రంలో కలిసేదాకా... ప్రతి అడుగూ భారతీయులకు పవిత్రమే. ఆ ఒడ్డున ఎన్ని నాగరికతలు పుట్టాయి! ఎన్ని సామ్రాజ్యాలు వెలిశాయి! ఎన్నెన్ని మట్టి కొట్టుకుపోయాయి! మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సాక్ష్యం'. గంగచుట్టూ అల్లుకున్న కథలూ గాథలూ ఐతిహ్యాలూ పురాణ ప్రాశస్త్యాలూ... నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ, ప్రతి కథా గంగ మీదున్న గంపెడు ప్రేమకు సాక్ష్యమే. ప్రతి ఐతిహ్యం ఆ తల్లికి పట్టే మంగళ హారతే.
Share:

గంగానది పుట్టు పూర్వోత్తరాలు


        నదులు పుట్టుక ప్రకృతి పై ఆధారపడి వర్షాధారముగానో , మంచు కొండలలోని మంచు కరగడము వలనో చిన్న పాయలు , వాగులు , సెలయేళ్ళు కలయిక వలన పల్లపు ప్రంతాలకు ప్రవహించడము వలన యేర్పడుతూ ఉంటాయి. ఇది ప్రకృతి సహజము . కాని మన హిందూ పురాణాలలో వ్యాసమహర్షి రచనలవలన అంతా దైవకృపవలనే జరిగినట్టుగా వ్రాయబడినది . కదో , నిజమో చరిత్ర కారులకే తెలుస్తుంది . ప్రస్తుతానికి ఇది ఒక పురాణ కధగానే చెప్పుకుంటున్నాము .

"గంగాధరా హర హర నమో" అని శివుణ్ణి ప్రార్ధిస్తాము . గంగను ధరించిన ఓ శివా నీకు నమష్కారము అని అంటాం. మరి ఆ గంగాదేవి ఎప్పుడు అవతరించినట్లూ , అంటే అందుకో పౌరాణిక కధ ఉంది. గంగాదేవికి అత్యంత ఇష్టమైన రోజూ , ఆమె ను అంతా పూజించవలసిన రోజూ ఏదంటే ... ఆ రోజే " గంగా సప్తమి " అనగా వైశాఖ శుక్లపక్ష సప్తమి -- గంగా సప్తమి .

కధ :
ఒకప్పుడు సగరుడు అనే సూర్యవంశ రాజు ఉండేవాడు . సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సాగరరాజు అశ్వమేథ యాగం చేయతలపెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి, కుయుక్తితో దానిని కపిల మాహర్షి దగ్గర కట్టి వేశాడు. ఆ దృశ్యాన్ని తిలకించిన యువ రాజులు కపిలుడే దానిని బంధించాడని భావించి, ఆయనను ఘాటుగా విమర్శించారు. అందుకు ఆగ్రహించిన ఆ ఋషి రాజకుమారులందరినీ భస్మంగా మారుస్తాడు.

సాగర చక్రవర్తి రెండవ భార్య కుమారుడు అసమంజ.అసమంజుని కొడుకు అంశుమానుడు..
పినతండ్రుల జాడ వెతుకుతూ అక్కడికి చేరుకుంటాడు. చుట్టూ బూడిదకుప్పలు. విషయం అర్థమైపోతుంది.అంసుమాన్‌ తమ తప్పును క్షమించి శాంతించమని ఆ ఋషిని వేడుకున్నాడు. దాంతో శాంతించిన రుషి... దేవలోకం నుండి గంగను భూమి మీదకు తేగలిగితే, రాకుమారుల ఆత్మలు శాంతిస్తాయన్నారు.. అరవైవేల పాపాల్ని ఒక్కదెబ్బతో కడిగేయగల శక్తి గంగకే ఉందని సలహా ఇస్తాడు గరుత్మంతుడు. సగరుడి తరం ముగుస్తుంది. అంశుమానుడి తరం ముగుస్తుంది. దిలీపుడి తరం ముగుస్తుంది. గంగను రప్పించడం ఎవరితరమూ కాదు. భగీరథుడి పాలన వెుదలవుతుంది. భగీరథ ప్రయత్నమూ వెుదలవుతుంది. అతని ఘోరతపస్సుకు మెచ్చి, బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని స్పష్టంచేస్తాడు. మధ్యలో ఓ మజిలీ అవసరమవుతుంది. పరమశివుడికే ఆ సామర్థ్యం ఉందంటాడు. భగీరథుడు శివుడ్ని ప్రార్థిస్తాడు. గంగను నెత్తినెక్కించుకోడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు..శివుడి జటాఝూటాల్లోంచి... గంగావతరణ వెుదలవుతుంది.

శివుడినెత్తిన ఉన్న సురగంగ...
హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని పాయలుగా తాకుతుంది. తూర్పువైపున... హ్లాదిని, పావని, నళిని. పశ్చిమం దిక్కున... సుచక్షు, సీత, సింధు. వెుత్తం ఆరుపాయలు. ఏడోపాయ మాత్రం భగీరథుడి రథం వెనకాలే పరిగెడుతుంది. దార్లోనే జహ్ను మహర్షి ఆశ్రమం.ఆ ప్రవాహానికి తాటాకు గుడిసెలన్నీ కొట్టుకుపోతాయి. మహర్షి ఆగ్రహోదగ్రుడవుతాడు. గంగను దోసిట్లో పట్టేసుకుని తీర్థంలా తాగేస్తాడు. ఆ బందిఖానా నుంచి విడుదలచేయమని అంతా వేడుకుంటారు. లోకకల్యాణార్థం మహర్షి సరేనంటాడు. చెవిలోంచి బయటికి వదిలేస్తాడు. ఎత్తుపల్లాల్ని దాటుతూ... ఎగుడుదిగుడుల్ని అధిగమిస్తూ... అపుడపుడూ ఉద్ధృతంగా... అక్కడక్కడా మందగమనంతో... ప్రవహించి ప్రవహించి భరతఖండాన్ని పావనం చేస్తుంది పుణ్యాల గంగ.

భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయ్యింది. జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది. నింగి, నేల, పాతాళం-మూడులోకాలు. తూర్పు, పడమర, దక్షిణం-మూడు దిక్కులు. ముచ్చటగా మూడువైపులా పారి, 'త్రిపథగ' అన్న పేరునూ సార్థకం చేసుకుంది. ఆ ప్రవాహం పుణ్యమాని సగరులు ముక్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మానవులు పరవశించారు. జలచరాలు జయజయధ్వానాలు చేశాయి. పచ్చని
పంటలు ప్రాణంపోసుకున్నాయి. భూమి స్వర్గమైంది. ఆ వైభోగం ముందు, అసలు స్వర్గం చిన్నబోయింది. గంగ భూమికి దిగొచ్చినరోజే, మకర సంక్రాంతి!

క్రాంతి అంటే మార్పు. భరతజాతి చరిత్రలో గంగావతరణాన్ని మించిన, గొప్ప మార్పేముంది? వ్యవసాయిక దేశంలో జలవనరులు నిండుగా మెండుగా పొంగిపొర్లిన నాడే నిజమైన పండగ. అందుకే, పచ్చని పంటలిచ్చిన గంగమ్మ ప్రత్యక్ష దైవమైంది. ఆ ఒడ్డునే పుణ్యక్షేత్రాలు వెలిశాయి. నగరాలు పుట్టాయి. సామ్రాజ్యాలు ప్రాణంపోసుకున్నాయి. నాగరికత పరిఢవిల్లింది. దివిగంగ భువికి దిగివచ్చిన తీరు అద్భుతం. అదో అపురూప ఘట్టం. 'రఘువంశం'లో కాళిదాసు పదప్రవాహం గంగాఝరిని గుర్తుకుతెచ్చింది. ఉత్పలవారి 'గంగావతరణం' మాత్రం తక్కువా?

'హృషీకేశ హరిద్వార రుష్యాశ్రమ ముక్తేశ్వర పుణ్యపదములెల్ల దాటి పొంగులెత్తి వచ్చెగంగ!'
...ఆ పద్యపాదాల్లో గంగమ్మ అడుగుల సవ్వడి వినిపిస్తుంది. బాపురమణల 'సీతాకల్యాణం'... గంగావతరణను వెండితెర మీద హృద్యంగా ఆవిష్కరించింది. సినారె ఆ క్రతువుకు కలంసాయం అందించారు. రవివర్మ నుంచి వడ్డాదివారి దాకా... ఎంతోమంది చిత్రకారులు ఆ అద్భుత దృశ్యానికి రంగులద్దారు.

మహాబలిపురంలోని గంగావతరణ శిల్పం... రాతితో మలచిన రమణీయ కావ్యం. కెవిన్‌ పెర్ష్‌ అనే ఆస్ట్రేలియా చిత్రకారుడైతే... ఆరేళ్లు శ్రమించి, వెుత్తం 21 చిత్రాలలో గంగాప్రవాహాన్ని కాన్వాస్‌ మీద సృష్టించాడు. 'ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి వేయి బొమ్మలైనా సరిపోవు. వంద రంగులున్నా చాలవు. నా ప్రయత్నం చంద్రుడికో నూలుపోగే' అని వినయంగా చెప్పుకున్నాడు కెవిన్‌.

ఆది గంగ...
గంగ పుట్టుక వెనుకా ఓ ఐతిహ్యం ఉంది. వామనుడు మూడడుగుల నేల అడిగాడు. బలి సవినయంగా సమర్పించుకున్నాడు. ఒక అడుగు భూమిని ఆక్రమించింది. రెండో అడుగు...ఇంతై ఇంతింతై బ్రహ్మలోకం దాకా విస్తరించింది. సాక్షాత్తు విష్ణుమూర్తి పాదం... గడపదాకా రావడమంటే, ఎంతదృష్టం! భక్తితో కాలు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. ఆ తీర్థమే... సురగంగగా అవతరించింది. భగీరథుడి కృషితో భూలోకానికి వచ్చింది. భారతీయుల హృదయగంగై ప్రవహించింది. భూగోళశాస్త్ర పరంగా చూసినా... గంగ ఇప్పటిది కాదు. వేదకాలం నాటికే ప్రవహించింది. కానీ అప్పట్లో సింధు, సరస్వతి నదులకే ప్రాధాన్యం.
రుగ్వేద రుక్కులు ఆ రెండు నదుల్నే కీర్తించాయి. ఓచోట 'గంగ' ప్రస్తావన ఉన్నా, ఆ మాట నీటికి సంబంధించిందో, ఏటికి సంబంధించిందో స్పష్టంగా తెలియదు. రుగ్వేదానంతర కాలంలో గంగ ప్రాధాన్యం పెరిగింది. వేదర్షులు గంగానదిని 'జాహ్నవి' అని పిలిచారు. రామాయణం నాటికి గంగకు పూజనీయ స్థానం లభించింది.

రామావతారంలో తాను గంగానది ఒడ్డునే పుడతానని విష్ణువు దివిజగంగకు మాటిచ్చాడు. సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు గుహుడు దాటించింది గంగానదినే. ఇక భారతమైతే గంగ ప్రవేశంతోనే గొప్ప మలుపు తిరుగుతుంది. శంతన మహారాజు అద్భుత సౌందర్యరాశి అయిన గంగ మీద మనసుపడతాడు. వరాలిచ్చి మనువాడతాడు. ఆ జంటకు పుట్టిన బిడ్డే భీష్మపితామహుడు. మిగిలిన భారతమంతా మనకు తెలిసిందే. చరిత్రలో గంగ
ప్రాధాన్యం విస్మరించలేనిది. మహామహా రాజ్యాలన్నీ గంగ ఒడ్డునే వెలిశాయి. సారవంతమైన గంగ-యమున పరీవాహక ప్రాంతంపై ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలు జరిగాయి.

జల సాక్షి...
నదీ తీరాల్లో నాగరికతలు పుట్టాయి. అంతరించాయి. రాజ్యాలు వెలిశాయి. మట్టికొట్టుకుపోయాయి. నదులు వర్తకవాణిజ్యాలకు కేంద్రాలయ్యాయి. పుణ్యక్షేత్రాలకు నిలయాలయ్యాయి. పాడిపంటలకు మూలమయ్యాయి. మనిషి మనుగడను మలుపుతిప్పిన నదీనదాలు చాలానే ఉన్నాయి. కానీ, అవన్నీ గంగానదులు కాలేకపోయాయి. భారతీయుల హృదయాల్లో గంగకున్న స్థానం వేరు. పుట్టుక నుంచి కట్టకడదాకా, ఆమాటకొస్తే మరణం తర్వాత కూడా... భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి. బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగతీర్థం పోయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. బిడ్డకు చేయించే తొలి స్నానం గంగాజలంతోనే. 'గంగేచ, యమునేచైవ గోదావరీ సరస్వతీ...' అంటూ పెద్ద ముత్తయిదువలు గంగమ్మను గంగాళంలోకి ఆహ్వానిస్తారు. ఆ పిలుపు వినిపించగానే, సర్వనదుల ప్రతినిధిగా... సురగంగ బిరబిరా తరలివస్తుంది.
కార్డు మీద పిన్‌కోడ్‌ నంబరు వేయకపోతే, పోస్టుమాస్టరుగారికి చిర్రెత్తుకొస్తుంది. సరైన చిరునామాలో అందించడానికి ఆ అంకెలు చాలా అవసరం.
సృష్టిమాస్టారుగారి పిన్‌కోడ్‌... గంగ! గంగా పరీవాహక ప్రాంత ప్రజలు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు... తాము గంగకు ఏ దిక్కున ఉన్నారో పరమాత్మకు విన్నవించుకోవాలి. లేదంటే, ఆ వెుర దేవరకు చేరదు. భారతీయులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా మునిగితీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగానది ఒకటి. ఆ స్పర్శతో సకలపాపాలూ హరించుకుపోతాయన్న నమ్మకం. అందుకే పితృదేవతలు పైలోకాల్లోంచి మనం గంగలో ఎప్పుడు మునకలేస్తామా అని ఎదురుచూస్తుంటారట. జీవిత చరమాంకంలో, మృత్యుఘడియ దగ్గరపడుతున్నప్పుడు... శ్వాస సహకరించకున్నా, గొంతు పెగలకున్నా, మాట
తడబడుతున్నా ఎక్కడలేని శక్తిని కూడదీసుకుని 'గంగ...' పోయమని అర్థిస్తాడు జీవుడు. తులసి కలిసిన ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే నేరుగా పుణ్యలోకాలకు చేరుకుంటామన్న నమ్మకం.

మహాభారతంలో... అంపశయ్య మీది నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు. ఒక్క గంగాస్నానంతో... యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం, పూజలూ వ్రతాలూ చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి. గంగ తగిలితే చాలు... అటు ఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ పవిత్రమైపోతాయట. గంగ లేని దేశం... సోమం లేని యజ్ఞమట! చంద్రుడు లేని రాత్రిలాంటిదట. పూలు పూయని చెట్టులాంటిదట. 'ఇన్ని మాటలెందుకు కానీ, గంగ గొప్పదనం చెబుతూ పోతే, సముద్రంలో నీటి కణాల్ని లెక్కపెట్టినట్టే ఉంటుంది' అంటాడు భీష్మపితామహుడు! గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ ఉన్నాయి. ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకేనేవో, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నవారి గొంతులో చిటికెడు గంగ పోస్తారు.
గంగానదిలోని కొన్నిరకాల సూక్ష్మక్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన వెుక్కల్నీ వనమూలికల్నీ తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అన్నిటికీ మించి, గంగ మీదున్న నమ్మకం, అచంచలమైన భక్తి..ఆ నీటికి అంత మహత్తునిచ్చింది.

జ్ఞానవాహిని..
గంగ... జ్ఞానగంగ! ఆ గాలి ప్రభావంతో, ఆ తీర్థ మహత్యంతో... ఎన్నో జీవితాలు మారాయి. చికట్లు తొలగిపోయాయి. అజ్ఞానం పటాపంచలైంది. అహం మంచులా కరిగిపోయింది. ఓరోజు శంకర భగవత్పాదులవారు గంగానదిలో స్నానానికి వెళ్తున్నారు. నాలుగు శునకాలతో చండాలుడు ఎదురొచ్చాడు. 'స్వామివారొస్తున్నారు. పక్కకు తప్పుకో' అని హెచ్చరించారు శిష్యులు. 'పక్కకు జరగమంది ఈ శరీరాన్నా? శరీరంలోని ఆత్మనా? అప్పుడది ద్వైతమే కానీ, అద్వైతం కాదే' అని వాదిస్తాడు చండాలుడు. కాదుకాదు, చండాలుని రూపంలోని పరమశివుడు. గంగమ్మ సాక్షిగా శంకరుడికి జ్ఞానబోధ అవుతుంది. కర్తవ్యోపదేశం జరుగుతుంది. గంగ మనసు వెన్న. పిలిస్తే పలుకుతుంది. అర్థిస్తే కరుణిస్తుంది. తెలుగు కవి పండితరాయలే ఆ మంచితనానికి ప్రత్యక్ష సాక్షి. 'గంగాలహరి' రాసిన పరమభక్తుడాయన. చివరి రోజుల్లో గంగలో ఐక్యం కావాలనుకున్నాడు. ఒడ్డున నిలబడి 'గంగాలహరి' పాడుతుంటే...ఒక్కో శ్లోకం పూర్తవుతుంటే, ఒక్కో అడుగూ ముందుకొచ్చి... ఆ కవిరాయలను తనలో కలిపేసుకుంది గంగ. ఇప్పటికీ, గంగానదికి పండితరాయల శ్లోకాలతోనే హారతులిస్తారు. ఇది, తెలుగువారికి గంగమ్మ మీదున్న భక్తికి నిదర్శనం. గంగమ్మకు తెలుగువారి మీదున్న ప్రేమకు తార్కాణం. ముక్తినిచ్చే తల్లి భుక్తిని మాత్రం ఇవ్వకుండా ఉంటుందా? గంగ, దాని ఉపనదుల పుణ్యమాని పరీవాహక ప్రాంతమంతా పచ్చదనమే. వరి, మిరప, చెరకు, జనపనార... తదితర పంటలు పుష్కలంగా పండుతాయి. పర్యాటకులతో పుణ్యక్షేత్రాలతో కళకళలాడే ఆ నదీతీరాలు... ఎంతోమందికి ఉపాధినిస్తున్నాయి. ఎన్నో పరిశ్రమలకు గంగనీరే దిక్కు. గంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఎక్కడో దేవలోకంలో పుట్టిన గంగ నలుగురి కోసం నేలకు దిగింది. పంటలకు నీరిచ్చింది. మనుషులకు పంటలిచ్చింది. జలచరాలకు ప్రాణమిచ్చింది. ఎంత మంచితనం, ఎంత త్యాగగుణం!

పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం ఎలాగో గంగను చూసే నేర్చుకోవాలి. ఉద్ధృత గంగా ప్రవాహం... అవసరాన్ని బట్టి అక్కడక్కడా మందగిస్తుంది. పరిస్థితులకు తలవొగ్గి, నిశ్శబ్దంగా ముందుకెళ్తుంది. నదీప్రవాహంలోనే కాదు, జీవన ప్రవాహంలోనూ పట్టువిడుపులుండాలన్న గొప్పపాఠమది. గంగ స్నేహానికి ప్రాణమిస్తుంది. ఎలాంటి ప్రాశస్త్యమూ లేని మామూలు వాగుల్నీ వంకల్నీ చిన్నాచితకా నదుల్నీ ప్రేమగా తనలో కలిపేసుకుంది. వాటికి పవిత్రతను కల్పించింది.
సజ్జన సాంగత్యంలోని గొప్పతనమే అది. ఇక యమునకైతే అర్ధ సింహాసనాన్నిచ్చి గౌరవించింది. రెండు మతాలు, రెండు ప్రాంతాలు, రెండు జాతులు, ఇద్దరు వ్యక్తులు... ఒక్కటిగా ఉండాలని చెప్పిన ప్రతిసారీ గంగాయమునల సంగమాన్నే గుర్తుచేసుకుంటాం. నిజానికి గంగ కంటే, యమున భౌతికంగా శక్తిమంతమైంది. ఉద్ధృతమైంది. కానీ గంగకున్న ఆధ్యాత్మికశక్తి ముందు, త్యాగమయమైన చరిత్రముందు యమున సవినయంగా తలవంచింది. అందుకే అది 'యమునాగంగ' సంగమం కాలేదు. 'గంగాయమున' సంగమమే అయ్యింది.

రామ్‌ తేరీ గంగా మైలీ...
మనిషి భస్మాసుర అంశ. లేకపోతే, వరాలతల్లికే ఉరిబిగిస్తాడా? దిగివచ్చిన దేవతనే అవమానిస్తాడా? వెర్రులెత్తిన స్వార్థంతో గంగనే మింగేస్తాడా? వ్యర్థాల్నీ రసాయనాల్నీ కాష్ఠాల్నీ కాలుష్యాల్నీ భరించలేక జాహ్నవి బేజారెత్తిపోయింది. పరిశ్రమల వ్యర్థాల కారణంగా ఎప్పటి నుంచో గంగమ్మనే నమ్ముకున్న వేలవేల జలచరజాతులు కనుమరుగు అవుతున్నాయి. పెళ్లీపేరంటాల్లో పట్టుపావడాలతో గెంతులేసే అమ్మాయిల్లా... గంగానదిలో సందడిచేసే డాల్ఫిన్లు...మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. కబ్జాలూ ఆక్రమణలూ ప్రవాహ గతినే మార్చేస్తున్నాయి. హద్దులు దాటిన భక్తి భక్తే కాదు. అది మూఢత్వం. వేలకొద్దీ దహనాలతో అమృతగంగ మృతకళేబరాలకు నిలయమైపోయింది. గంగలో కలుపుతున్న పూలూ అస్తికలూ బూడిదలూ... జీవరాశినిబలిగొంటున్నాయి.

మరింత కాలుష్యాన్ని పోగుచేస్తున్నాయి. ఇది చాలదన్నట్టు...ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు. ఒకప్పుడు, సకలరోగాల నుంచి విముక్తి కలిగించిన ఔషధ గంగ... ఇప్పుడు, సర్వరోగాలకూ కారణం అవుతోంది. ఈ దుస్థితిని చూడలేక, ఆ దుర్వాసన భరించలేక నదీమతల్లిని దేవతగా ఆరాధించే భక్తుల కళ్లలో గంగ పొంగుకొస్తోంది. ఇంకో పుష్కరం వస్తోందంటే, ఇంకెంత చెత్త పోగవుతుందో అని భయపడాల్సిన పరిస్థితి.

భాగీరథీ సుఖదాయినీ మాతా
తవ జల మహిమా నిగమే ఖ్యాతా
నాహం జానే తవ మహిమా
పాహి కృపామయీ మమాజ్ఞానమ్‌
'గంగమ్మా! వరాలిచ్చే చల్లని తల్లీ!


నీ పవిత్రతను వేదాలు కీర్తించాయి. ప్రపంచమంతా కొనియాడింది. కానీ అవేవీ తెలియని అజ్ఞానులం మేం. నిన్ను కాలుష్యకాసారంగా మార్చినందుకు క్షమించు' అని లెంపలేసుకోడానికి పుష్కరమే సరైన సమయం. పశ్చాత్తాపం మనసులోని మాలిన్యాల్ని కడిగేస్తుంది. గంగాజలాల శుద్ధికి కూడా అదే సత్సంకల్పం.

గంగ...శుభ్రంగా!
వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ ప్రకారం...ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యానికి గురైన పది నదుల్లో గంగ ఒకటి. దాదాపు 30 నగరాల మురుగు, 25 పట్ణణాల కాలుష్యం, వేలకొద్దీ గ్రామాల వ్యర్థాలు... అంతా కలిసి దాదాపు మూడువేల మిలియన్‌ లీటర్ల చెత్తాచెదారం గంగలో కలుస్తోంది. గంగానదిలోంచి కాలుష్యాన్ని తరిమేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలే చేశాయి. న్యాయస్థానాలు కూడా బాగానే వెుట్టికాయలు వేశాయి. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 'గంగా యాక్షన్‌ ప్లాన్‌' కింద నదీజలాల శుద్ధికి దాదాపు వేయి కోట్లు ఖర్చుచేశారు. అయినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. తాజాగా పర్యావరణ మంత్రిత్వశాఖ 43 ప్రాజెక్టుల కింద రూ.2,400 కోట్లు మంజూరు చేసింది. ఈ వెుత్తంతో గంగానది అధికంగా కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాల్లో ... నీటిశుద్ధి ప్లాంట్లు, మురుగునీటి కాలువలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. 2020 నాటికంతా గంగానదిని స్వచ్ఛంగా తయారుచేయాలన్నది జాతీయ గంగా పరీవాహక సంస్థ ఆశయం. దీనికి సాక్షాత్తు ప్రధానమంత్రే నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి కూడా భారీవెుత్తంలో సాయం అందబోతోంది. ఎలాగైనా సరే, గంగను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఏడు ఐఐటీలకు చెందిన నిపుణులతో ఓ బృందం ఏర్పాటైంది. ఏ కార్యక్రమ విజయానికైనా నిధులొక్కటే ప్రధానం కాదు... ప్రజా భాగస్వామ్యం ఉండాలి. పాలకుల చిత్తశుద్ధి ముఖ్యం. గంగ విషయంలో ఈ రెండే కరవవుతున్నాయి.

గంగా ప్రవాహం.

గంగోత్రి హిమనీనదంలో పుట్టిన భగీరథి దేవ ప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి... 'గంగ' అవుతుంది. హరిద్వార్‌ దగ్గరికొచ్చి... జనగంగ అవుతుంది. కోసి, గోమతి, శోణ తదితర నదులు ప్రవాహ మార్గంలో కలుస్తాయి. అలహాబాద్‌ దగ్గర యమున తోడవుతుంది. ఆ తర్వాత ఎన్నో చిన్నాపెద్దా నదులు గంగలో కలిసి ఉద్ధృతిని పెంచుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా దగ్గర గంగ వెుదటిసారి చిలుతుంది. అక్కడి నుంచే గంగానది చిలిక... హుగ్లీనది వెుదలవుతుంది. ప్రధాన గంగను... మాల్దా తర్వాత పద్మానది అంటారు. బంగ్లాదేశ్‌లో ప్రవేశించాక, బ్రహ్మపుత్ర చిలిక అయిన జమునానది ఇందులో కలుస్తుంది. ఆతర్వాత మేఘన జతవుతుంది. ఆతర్వాత ఎన్నో చిలికలుగా ప్రవహించి... బంగాళాఖాతంలో కలుస్తుంది.

గంగా నది పుష్కర వైభవం

పన్నెండేళ్లకోసారి వచ్చే పెద్దపండగకు గంగానది సిద్ధమవుతోంది. ఆ పన్నెండురోజులూ గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలు పుష్కరశోభతో కళకళలాడతాయి. అసలు పుష్కరాలెందుకు? వాటి ప్రాశస్త్యం ఏమిటి? ... అదంతా ఓ పెద్ద కథ. పూర్వం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేశాడు. భక్తవశంకరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. పుష్కరుడు మణులో మాణిక్యాలో అడగలేదు. రాజ్యాలూ సామ్రాజ్యాలూ ఆశించలేదు. జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి. నదులు పునీతమైతే దేశమూ సుభిక్షంగా ఉంటుందని ఆ సత్పురుషుని ఆలోచన. అందుకే, 'దేవా... నా శరీర స్పర్శతో సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు' అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు 'నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఆ నదిలో స్నానమాచరించిన వారు పాపవిముక్తులవుతారు. జన్మరాహిత్యాన్ని పొందుతారు' అని వరమిచ్చాడు. పుష్కరుడు సంతోషించాడు. పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు(బృహస్పతి) తనకూ పుష్కరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను అడిగాడు. అందుకు పుష్కరుడు అడ్డుచెప్పాడు. ఇద్దరికీ నచ్చజెప్పి సమాన ప్రాతినిధ్యం కల్పించాడు బ్రహ్మ. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగా, చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు.

గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో, గంగ పుష్కరాలు వెుదలవుతాయి. ఆ ప్రకారం మే 8 నుంచి 19 దాకా... గంగకు పుష్కర మహత్తు వస్తుంది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానంచేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి.

ప్రతి మనిషి ఒంట్లో ఉండే మూడొంతుల నీరు గంగే. ఉద్వేగం పెల్లుబికినప్పుడు, జలజలా కారే కన్నీరు గంగే. కాయకష్టం చేసినప్పుడు, బొటబొటా రాలే చమటబిందువు గంగే! పూజారి చేతి పవిత్ర తీర్థం గంగ. ఆకాశంలోంచి కురిసే చిన్ని చినుకు గంగ. పాతాళంలోంచి పొంగే జలధార గంగ. గంగ... వేదాల్లో ఉంది. ఉపనిషత్తుల్లో ఉంది. రామాయణంలో ఉంది. భారతంలో ఉంది. భాగవతంలో ఉంది. భగవద్గీతలో ఉంది. అనగనగా కథల్లో ఉంది. జానపద గాథల్లో ఉంది. పల్లెపాటల్లో ఉంది. పామరుల నమ్మకాల్లో ఉంది. అయినా, గంగ లేనిదెక్కడ? పుట్టింది హిమాలయాల్లో అయినా, మెట్టింది బికారి శివయ్యనే అయినా... గంగ సమస్త భారతీయుల హృదయగంగ. గంగ అంతర్వాహిని. గంగ అనంతవాహిని.

రోజుకు పాతిక లక్షల మంది గంగలో మునుగుతారు. రోజుకు కోటిమంది పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటారు. 'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా'లో నెహ్రూ ఎంతగొప్ప మాటన్నారు... 'గంగ పుట్టింది వెుదలు సముద్రంలో కలిసేదాకా... ప్రతి అడుగూ భారతీయులకు పవిత్రమే. ఆ ఒడ్డున ఎన్ని నాగరికతలు పుట్టాయి! ఎన్ని సామ్రాజ్యాలు వెలిశాయి! ఎన్నెన్ని మట్టి కొట్టుకుపోయాయి! మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సాక్ష్యం'. గంగచుట్టూ అల్లుకున్న కథలూ గాథలూ ఐతిహ్యాలూ పురాణ ప్రాశస్త్యాలూ... నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ, ప్రతి కథా గంగ మీదున్న గంపెడు ప్రేమకు సాక్ష్యమే. ప్రతి ఐతిహ్యం ఆ తల్లికి పట్టే మంగళ హారతే.
Share:

అష్టాదశ శక్తి పీఠాలు

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు.




ఈ శక్తిపీఠాలను గుర్తించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మనదేశం లోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు . ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది . వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు . వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు . వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు . ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు .
అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కధ

          ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్


అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. ఆ క్షేత్రాల గురించిన వివరాలు...

1.శాంకరీదేవి
లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2.కామాక్షి
సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

3.శృంఖల
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

4.చాముండి
హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5.జోగులాంబ
మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

6.భ్రమరాంబిక
విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

7.మహాలక్ష్మి
రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

8.ఏకవీరాదేవి
మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

9.మహాకాళి
సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

10.పురుహూతిక
పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

11.గిరిజాదేవి
గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12.మాణిక్యాంబ
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13.కామాఖ్య
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14.మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.

15.సరస్వతి
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16.వైష్ణవీదేవి
అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

17.మంగళగౌరి
సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18.విశాలాక్షి
సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.
...ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు.
Share:

అష్టాదశ శక్తి పీఠాలు

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు.




ఈ శక్తిపీఠాలను గుర్తించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మనదేశం లోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు . ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది . వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు . వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు . వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు . ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు .
అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కధ

          ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్


అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. ఆ క్షేత్రాల గురించిన వివరాలు...

1.శాంకరీదేవి
లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2.కామాక్షి
సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

3.శృంఖల
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

4.చాముండి
హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5.జోగులాంబ
మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

6.భ్రమరాంబిక
విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

7.మహాలక్ష్మి
రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

8.ఏకవీరాదేవి
మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

9.మహాకాళి
సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

10.పురుహూతిక
పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

11.గిరిజాదేవి
గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12.మాణిక్యాంబ
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13.కామాఖ్య
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14.మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.

15.సరస్వతి
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16.వైష్ణవీదేవి
అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

17.మంగళగౌరి
సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18.విశాలాక్షి
సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.
...ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు.
Share:

Monday, 2 December 2013

అసలు దండనీతి ఎందుకు?

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.



అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని ధర్మరాజు! అసలు దండనీతి ఎందుకు? దండం లేకుండా ప్రజలని, కుటుంబాన్ని పాలించలేమా?
భీష్ముడు: సృష్టిని నాశనం చేసేది ఒకే ఒక్క ఆయుధం. విచ్చలవిడితనం. దండం లేకపోతె ప్రజలేకాదు కుటుంబసభ్యులు కూడా మాట వినరు. 
సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ ఒక యజ్ఞం చేయాలనీ సంకల్పించి క్షుతుడు అనే ఋత్విక్కుని సృష్టించాడు. అతనితో! నువ్వు సృష్టి కోసం ఒక యజ్ఞం చేయించాలి నాతో, కనుక అన్ని ఏర్పాట్లు చెయ్యి అని పంపించాడు. ఆ ఋత్విక్కు వెళ్లి అక్కడ ఉన్నవారితో నువ్వు ఇటుకలు తీసుకురా, నువ్వు ఆవుని తీసుకురా! నువ్వు నీళ్ళు తీసుకునిరా అంటుంటే ఎవ్వరూ వినడంలేదు. ఇంతింత బొజ్జలు వేసుకుని కదలకుండా ''ఆ చేద్దాం, ఆ చూద్దాం'' అనుకుంటూ అవులిస్తున్నారు. దీనితో ఆ ఋత్విక్కు భయపడి బ్రహ్మ దగ్గరికి వచ్చి దేవా! నువ్వేమో యజ్ఞం చేయమంటావు. కాని ఎవరూ మాట వినడంలేదు. కొట్టినా, తిట్టినా కదలడంలేదు. ఎవరు ఏమాట వినడంలేదు. ఇలా ఐతే ఎలా చేయించాలి. నావల్ల కాదు. అనగానే బ్రహ్మ, విష్ణువు కలిసి శివుడిదగ్గరికి వెళ్తారు. శివుడితో విషయం చెప్పి ఏమిచేయాలి అని మౌనంగా ఉన్నారు. ఇంతలో శివుడు దండంతో పాటు దండనీతిని సృష్టించాడు. ఇక నుండి దండం నేనే, దండనీతి నేనే! ఈ ప్రపంచాన్నంతా అల్లకల్లోలం చేసేది విచ్చలవిడి తనం. ప్రజలు, కుటుంబం అదుపుతప్పకుండా ఉండాలంటే ప్రభువు, ఇంటి యజమాని శిక్షించాలి. దండం,దండనీతి ఉపయోగించాలి. ప్రభువులు చట్టం చేయాలి. ఈ పని చేస్తే శిక్ష, ఈ పని చేస్తే రక్ష. ప్రతి వ్యక్తికీ ఇది నీటిని నేర్పే అద్భుత శాస్త్రం ఈ దండనీతి. దండనీతి ఉపయోగించేటప్పుడు కర్ర ఒకటి పక్కన ఉండాలి. నీతి విన్నాడా రక్షించాలి. వినలేదా శిక్షించాలి. ఈనాటినుండి దండం దండనీతి నేనే అని ఆనాటినుండి శివుడు లయకారకుడు అనే పేరుపొందాడు. ఆనాటినుండే వర్ణాశ్రమ ధర్మాలు వచ్చాయి. ఒరేయ్ నువ్వు ఈపని చెయ్యి అంటే చెయ్యాలి. లేదా ఒక్కటి ఇవ్వడమే. ఇలా కొంతకాలానికి ఈగుంపు అంతా ఈపని చేయండి. ఈగుంపు అంతా ఈపని చేయండి అని గుణకర్మములు వారివారి సామర్ధ్యములను బట్టి వారి వారి చేత పనులు చేయించడం మొదలుపెట్టారు. ఆనాటి నుండి పరమేశ్వరుడి వలన సృష్టి ఈవిధంగా చక్కగా నడుస్తుంది. భయం లేకపోవడం వలన మానవుడు అదుపుతప్పుతాడు. కాబట్టి శిక్షించవలసిందే. లేదంటే ఎవరికీ వారు కోట్లు సంపాదించి ప్రభుత్వాన్ని, ప్రజలని ఇబ్బంది పెడతారు. ఆనాటి నుండి ప్రజలు సుఖశాంతులతో బ్రతకడానికి, సంపాదించుకుని ధర్మ అర్ధ, కామ, మోక్షములు సాధించడానికి! ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే 4వేదాలు, శిక్ష, వ్యాకరణం, జ్యోతిష్యం, కల్పం, నిరుత్తం, ఛందస్సు అనే షడంగాలు, ఇవి కాకుండా పురాణం, ధర్మశాస్త్రం, న్యాయ శాస్త్రం, పూర్వోత్తర మీమాంస శాస్త్రం, ఇవి నాలుగు వీటితో పాటుగా వైద్య విద్యా, విలువిద్య, సంగీతం, నీతిశాస్త్రం లేక న్యాయవిద్య, ఇవి నాలుగు ఉప వేదాంగాలు కలిపితే మొత్తం 18 విద్యలు. ఈ అష్టాదశ విద్యలు పెట్టి వీటిని నేర్చుకోండి. వీటివలన మీ కర్తవ్యా కర్తవ్యాలు తెలుస్తాయి. అన్నిరకాలుగా రంగాలలో ఆరితెరుతారు. ఇవన్ని కలిస్తే లోకం అంతా సుఖంగా వుంటుంది. అని వీటికి లోకానికి అందజేశాడు. చివరికి దండనీతితో నువ్వు ఇది చదవమన్నాను కదా చదవ్వే , ఇదిగో నీకు సంగీతం పాడటం అలవాటు కదా పాడవే? పాడు. ఇదిగో నువ్వు కల్పం, నువ్వు జ్యోతిష్యం అని చెప్పేవాడు.
ఇదికూడా మళ్లి పుట్టుకతో కాదు. వారి వారి ప్రవర్తనను బట్టి,వారికీ దానిమీద ఉన్న ఆసక్తిని బట్టి నేర్పేవారు. (ఇప్పటికి కొందరిని చుడండి. కొందరికి ఆటలంటే ఇష్టం, కొందరికి రిపేర్లు చేయాలంటే ఇష్టం, కొందరికి సంగీతం అంటే, ఇంకొందరికి నటించడం, మరికొందరికి చదవడం, వ్రాయడం, కవితలు చెప్పడం ఇష్టం. మీలో చాలామందికి మీరు చేసే వృత్తులు కాకుండా కొన్నిటిమీద ప్రత్యెక అభిమానం ఉంటుంది.) ఇవన్ని దండనీతితో మహారాజుల ద్వార అమలుచేయించేవాడు.
అలా దండనీతి తోనే ధర్మం, న్యాయం ప్రవర్ద్దిల్లుతాయి. అంతేకాని మాటలతో వినరు. అని ధర్మరాజుకి దండనీతి గురించి తెలియజేశాడు
Share:

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com