..

  • This is featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

Saturday 31 August 2013

కాకులను పితృదేవతలుగా భావించి

      కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే వున్నాం. జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి. దీనిప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు.
      సాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే.. నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి.
     కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ మరిచిపోలేదు.
      ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.


Share:

కాకులను పితృదేవతలుగా భావించి

      కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే వున్నాం. జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి. దీనిప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు.
      సాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే.. నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి.
     కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ మరిచిపోలేదు.
      ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.


Share:

Thursday 29 August 2013

ప్రకృతి - పురుషుడికి బేదం

జనకమహీజాని ప్రకృతి - పురుషుడికి బేదం చెప్పండి అని యాజ్ఞవల్క్య మహామునిని అడిగాడు.
   యాజ్ఞవల్క్య మహాముని : ఓ దీపిక నుండి అనేక దీవులు ఉద్భవించినట్టు సత్వరజస్తామోగుణ పరిణామాల వల్ల ప్రకృతి నుండి విచిత్ర రూపాలు ఉద్భవిస్తున్నాయి. సంతోషం, ఆనందం, ఆరోగ్యం, క్రోధరాహిత్యం, ఋజత్వం, పరిశుద్ధి, ప్రకషత, సుస్తిరత్వము, అహింస, నిర్మలశ్రద్ద, వినీతి, లజ్జ, శౌచము, సమత, సదాచారము, కార్పణ్య రాహిత్యము, ఆదిగాగలవి సత్వ గుణాలనిఆర్యులు ఉపదేసిస్తున్నారు. దర్పము, క్రోధము, అభిమానము, మాత్సర్యము, కారుణ్య విహీనత, నిరంతర భోగభిలాష, అహంకారము ఆదిగాగలవి రాజసమని, మోహము, మౌర్ఖ్యము ఆదిగాగలవి తామసాలని విజ్ఞులు ఏకగ్రీవంగా వినుతిస్తున్నారు.
తన గుణాల ప్రభావం వల్లనే ప్రకృతి అంతరాత్మలో వేర్వేరు వికృతులు ఉద్భవింపజేస్తున్నది. ఇది దాని సహజ స్వభావము. పురుషుడు చైతన్యాత్మకుడు, ప్రక్రుతి జడ స్వభావం. ప్రకృతి పురుషుని సదా తన గుణాలవైపు ఆకర్షిస్తున్నది. పరతత్వం ప్రక్రుతి గుణాలచే సమాకర్షితమైన యెడల సంసారబద్దమై వేర్వేరు సుకృత, దుష్కృత కర్మలు ఆచరిస్తున్నది.. వివిధ రూపాలతో వివిధ జన్మలతో స్వర్గ, మత్స్య పాతాళాది లోకాలలో పరిబ్రమిస్తున్నది. పురుషుడు తనని తాను ఎరిగిన యెడల అవ్యక్త గుణాలలో చిక్కుకోజాలడు. నిర్మలుడై, నిరంజనుడై కేవలం స్వస్వరూపంతో వెలుగొందుతున్నాడు. 


    పురుష ప్రకృతి తత్వాలు రెండు అనాది-నిదానాలు. ఆగ్రహ్యాలు-అచలాలు,   ఈ రెండింటిలోనూ పురుషతత్వం సచాతనమని, ప్రకృతితత్వం చైతన్య విహీనమని నీవు ఆనతిస్తున్నావు! ఈ విభేదానికి ఏమి కారణం అని అడిగాడు జనకమహీపతి. ఈ సందేహం మనకి కూడా వస్తుంది. 
     సగుణమైన వస్తువు అగుణం కాజాలడు. అలాగే అగుణమైన వస్తువు సగుణం కాజాలదు. ప్రకృతి సర్వదా గుణ సమేతము జడము. పురుషుడు ప్రకృతి స్వభావం సంపూర్ణంగా గ్రహిస్తున్నది. ప్రకృతికి ఆ వివేచనా జ్ఞానం లేదు. ప్రకృతి అచేతన. పురుషుడు చైతన్యవంతుడు. ఇది వస్తుతత్వం గుర్తెరిగిన మహామహులైన మునీంద్రుల అబివర్ణనం. ఇదిన్ని గాక ప్రకృతి పురుషుల సహజగుణం. ఈ విభేదాలకు ఇంతకన్నా మరొక హేతువేదిలేదు.
      ఇద్దరూ విభిన్నులే. అయితే పురుషుడు క్రమ క్రమంగా పురుషోత్తమ స్వరూపుడై ఇరువదిఆరవ తత్వంలో మేళవిస్తున్నాడు. ప్రకృతి ఎన్నడూ పురుషుడిని కనుగోననేరదు. ప్రకృతి ఎడల పారవశ్యం వల్లనే పురుషుడు మొహవిష్టుడై సదా ప్రకృతి తన్మయుడై సంసారచక్రంలో పరిబ్రమిస్తున్నాడు. పురుషుడు పురుషోత్తమ స్వభావం ఎట్టిదో గ్రహించనేరక అనేకవిధాల పరిబ్రమిస్తున్నాడు. దీనిని కనుగొనిన ఎడల ప్రకృతి సంసర్గం నిశ్శేషంగా పరిత్యజించి అవలొకించుకొగలిగిన ఎడల పురుషుడు అనతికాలంలోనే పురుషోత్తమునిలో మేళవించి పునర్జీవ రహితుడు అవుతాడు. ఇది కేవలం నిర్మల విజ్ఞాన మహిమవల్లనే అట్టి మహోత్తరమైన పరమపదం అందుకోగలడు. ప్రశాంతి విహీనులకి ఇది కేవలం దుస్సాద్యం. మోక్షానికి ఇంతకన్నా పరమ శ్రేష్టమైన మార్గం మరొకటిలేదు. సుజ్ఞానం వల్లే కాని మానవుడు ఎన్నటికీ జన్మ మృత్యు బంధనాలనుండి విముక్తి కానేరడు. కనుక సుజ్ఞాన సంపాదనకై సర్వదా ప్రయత్నించవలెను. మోక్ష శ్రద్ధ లేని యెడల జనన మరణ జంజాటం తప్పదు. కేవలం అజ్ఞానం వల్లనే ఖర్మ సంసర్గం కలుగుతున్నది. ఇది నిరంతర దుఃఖాల హేతువు. ఈ మార్గంలో సాధన చేసిన యెడల తప్పక శుభం చేకూరగలదు... 

Share:

ప్రకృతి - పురుషుడికి బేదం

జనకమహీజాని ప్రకృతి - పురుషుడికి బేదం చెప్పండి అని యాజ్ఞవల్క్య మహామునిని అడిగాడు.
   యాజ్ఞవల్క్య మహాముని : ఓ దీపిక నుండి అనేక దీవులు ఉద్భవించినట్టు సత్వరజస్తామోగుణ పరిణామాల వల్ల ప్రకృతి నుండి విచిత్ర రూపాలు ఉద్భవిస్తున్నాయి. సంతోషం, ఆనందం, ఆరోగ్యం, క్రోధరాహిత్యం, ఋజత్వం, పరిశుద్ధి, ప్రకషత, సుస్తిరత్వము, అహింస, నిర్మలశ్రద్ద, వినీతి, లజ్జ, శౌచము, సమత, సదాచారము, కార్పణ్య రాహిత్యము, ఆదిగాగలవి సత్వ గుణాలనిఆర్యులు ఉపదేసిస్తున్నారు. దర్పము, క్రోధము, అభిమానము, మాత్సర్యము, కారుణ్య విహీనత, నిరంతర భోగభిలాష, అహంకారము ఆదిగాగలవి రాజసమని, మోహము, మౌర్ఖ్యము ఆదిగాగలవి తామసాలని విజ్ఞులు ఏకగ్రీవంగా వినుతిస్తున్నారు.
తన గుణాల ప్రభావం వల్లనే ప్రకృతి అంతరాత్మలో వేర్వేరు వికృతులు ఉద్భవింపజేస్తున్నది. ఇది దాని సహజ స్వభావము. పురుషుడు చైతన్యాత్మకుడు, ప్రక్రుతి జడ స్వభావం. ప్రకృతి పురుషుని సదా తన గుణాలవైపు ఆకర్షిస్తున్నది. పరతత్వం ప్రక్రుతి గుణాలచే సమాకర్షితమైన యెడల సంసారబద్దమై వేర్వేరు సుకృత, దుష్కృత కర్మలు ఆచరిస్తున్నది.. వివిధ రూపాలతో వివిధ జన్మలతో స్వర్గ, మత్స్య పాతాళాది లోకాలలో పరిబ్రమిస్తున్నది. పురుషుడు తనని తాను ఎరిగిన యెడల అవ్యక్త గుణాలలో చిక్కుకోజాలడు. నిర్మలుడై, నిరంజనుడై కేవలం స్వస్వరూపంతో వెలుగొందుతున్నాడు. 


    పురుష ప్రకృతి తత్వాలు రెండు అనాది-నిదానాలు. ఆగ్రహ్యాలు-అచలాలు,   ఈ రెండింటిలోనూ పురుషతత్వం సచాతనమని, ప్రకృతితత్వం చైతన్య విహీనమని నీవు ఆనతిస్తున్నావు! ఈ విభేదానికి ఏమి కారణం అని అడిగాడు జనకమహీపతి. ఈ సందేహం మనకి కూడా వస్తుంది. 
     సగుణమైన వస్తువు అగుణం కాజాలడు. అలాగే అగుణమైన వస్తువు సగుణం కాజాలదు. ప్రకృతి సర్వదా గుణ సమేతము జడము. పురుషుడు ప్రకృతి స్వభావం సంపూర్ణంగా గ్రహిస్తున్నది. ప్రకృతికి ఆ వివేచనా జ్ఞానం లేదు. ప్రకృతి అచేతన. పురుషుడు చైతన్యవంతుడు. ఇది వస్తుతత్వం గుర్తెరిగిన మహామహులైన మునీంద్రుల అబివర్ణనం. ఇదిన్ని గాక ప్రకృతి పురుషుల సహజగుణం. ఈ విభేదాలకు ఇంతకన్నా మరొక హేతువేదిలేదు.
      ఇద్దరూ విభిన్నులే. అయితే పురుషుడు క్రమ క్రమంగా పురుషోత్తమ స్వరూపుడై ఇరువదిఆరవ తత్వంలో మేళవిస్తున్నాడు. ప్రకృతి ఎన్నడూ పురుషుడిని కనుగోననేరదు. ప్రకృతి ఎడల పారవశ్యం వల్లనే పురుషుడు మొహవిష్టుడై సదా ప్రకృతి తన్మయుడై సంసారచక్రంలో పరిబ్రమిస్తున్నాడు. పురుషుడు పురుషోత్తమ స్వభావం ఎట్టిదో గ్రహించనేరక అనేకవిధాల పరిబ్రమిస్తున్నాడు. దీనిని కనుగొనిన ఎడల ప్రకృతి సంసర్గం నిశ్శేషంగా పరిత్యజించి అవలొకించుకొగలిగిన ఎడల పురుషుడు అనతికాలంలోనే పురుషోత్తమునిలో మేళవించి పునర్జీవ రహితుడు అవుతాడు. ఇది కేవలం నిర్మల విజ్ఞాన మహిమవల్లనే అట్టి మహోత్తరమైన పరమపదం అందుకోగలడు. ప్రశాంతి విహీనులకి ఇది కేవలం దుస్సాద్యం. మోక్షానికి ఇంతకన్నా పరమ శ్రేష్టమైన మార్గం మరొకటిలేదు. సుజ్ఞానం వల్లే కాని మానవుడు ఎన్నటికీ జన్మ మృత్యు బంధనాలనుండి విముక్తి కానేరడు. కనుక సుజ్ఞాన సంపాదనకై సర్వదా ప్రయత్నించవలెను. మోక్ష శ్రద్ధ లేని యెడల జనన మరణ జంజాటం తప్పదు. కేవలం అజ్ఞానం వల్లనే ఖర్మ సంసర్గం కలుగుతున్నది. ఇది నిరంతర దుఃఖాల హేతువు. ఈ మార్గంలో సాధన చేసిన యెడల తప్పక శుభం చేకూరగలదు... 

Share:

Tuesday 27 August 2013

"శీర్యతే ఇతి శరీరమ్"

"శీర్యతే ఇతి శరీరమ్" నాశనమయ్యే స్వభావం కలది కాబట్టి దీనిని శరీరం అంటున్నాము.భిన్న దేహాలను ఒకదాని తరువాత మరొకటిగా జీవుడు స్వీకరిస్తాడు. తన కర్మల ననుసరించి జీవుడు వివిధ దేహాలను పొందుతాడు. జీవునికి లభ్యమయ్యే దేహాలలో మానవ దేహం ఉత్తమమైనది. శాస్త్రాలు అలాగే చెప్తున్నాయి. శాస్త్రాలు చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే ఆత్మ, దేహం ఒకటి కాదని ముందు గ్రహించాలి. ఇతర దేహాలకు లేని ప్రాధాన్యత మానవ దేహానికి ఎందుకని ఇచ్చారు ఇతర దేహాలు పూర్వ కర్మ ఫలాలను అనుభవించటానికి మాత్రమే. మానవ దేహం నూతనంగా కర్మలను ఆచరిన్చాగలదు. అదే ముఖ్యమైన తేడా. పశువుల జీవితాలు ఆహార స్వీకారం, నిద్ర మొదలైన వాటిలో గడిచిపోతున్నాయి.
"దండో ద్యత కరం పురుషమభిముఖముపలభ్యమాం
హంతు మయమిచ్చతీతి పలాయితుమారంభతే"
పశువులు ఎవరైనా కర్ర తీసుకొని వస్తే పారిపోతాయి. "హరితతృణ పూర్ణ పాణి ముపలభ్యతం ప్రత్యభి ముఖీ భవంతి" చేతిలో పచ్చగడ్డితో వస్తే అతనిని సమీపిస్తాయి. పశువులకు తెలిసిందంతే. కానీ మానవుదలా కాదు భగవద్దత్తమైన బుద్ధి కారణంగా మోక్షాన్ని కూడ సంపాదించగల యోగ్యతను కలిగియున్నాడు. అతని బుద్ధి వ్యవహరించే తీరును బట్టి ఎదైనా సాధించగలదు. అందువలన మానవజన్మ విశేషమైనదని శాస్త్రంలో చెప్పబడింది.
"మహతా పుణ్య పణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయా
పారం దుఃఖోదధేర్గన్తుం తర యావన్న భిద్యతే!!"
మానవదేహం ఒక నావలాంటిది. చాల ధనాన్ని వెచ్చించి దానిని ఖరీదు చేశాం. మరొకటి దొరుకుతుందో లేదో తెలియదు. దానితో ఒక మహాసాగరాన్ని దాటాలి. దానికి మధ్యలో బీటలు పడి, మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నావ ఎక్కువకాలం ఉండదనీ విదితమే. అలా పడిన బీటలు వారే లోపల, ఆ పడవను ఖరీదు చేసిన ఉద్దేశ్యం నెరవేర్చుకున్నట్లయితే అటువంటి వానిని తెలివైన వాడనాలి. ఇంతకీ ఆ మహాసాగరం ఏమిటి? జనన మరణ వలయమే ఒక మహాసాగరం. మానవ జీవిత సార్ధకత జ్ఞానము ద్వారానే సాధ్యమవుతుంది. కానీ మరో దానితో కాదు. మానవ దేహాన్ని పొందిన తరువాత కూడా జ్ఞాన సముపార్జనకై ప్రయత్నించని వారు మానవ జన్మను వృథా చేసినట్లే.అటువంటి వారు పశువులుగా జన్మించటమే మేలు. ఎందువల్లననగా పశువులకు ప్రత్యవాయం అంటూ ఉండదు కాబట్టి.
అపి మానుష్యకం లబ్ధ్వా భవంతి జ్ఞానినో న యే!
పశుతైవ వరం తేషాం ప్రత్యవాయాప్రవర్తనాత్!!
సంధ్యావందనాన్ని మనం నిర్ణీత సమయంలో చేయకపోతే పాపం వస్తుంది. కానీ పశువు సంధ్యావందనం చేయకపోతే ఏ పాపమూ రాదు. సంధ్యావందనం చేయని బ్రాహ్మణుని కంటే పశువే ఉత్తమమైనది. అందువలన మానవ జన్మ జ్ఞాన సముపార్జనకే అని తీర్మానం. మనం జ్ఞానాన్ని పొంది జీవితాన్ని సార్ధకమొనరించుకోవాలి.
Share:

"శీర్యతే ఇతి శరీరమ్"

"శీర్యతే ఇతి శరీరమ్" నాశనమయ్యే స్వభావం కలది కాబట్టి దీనిని శరీరం అంటున్నాము.భిన్న దేహాలను ఒకదాని తరువాత మరొకటిగా జీవుడు స్వీకరిస్తాడు. తన కర్మల ననుసరించి జీవుడు వివిధ దేహాలను పొందుతాడు. జీవునికి లభ్యమయ్యే దేహాలలో మానవ దేహం ఉత్తమమైనది. శాస్త్రాలు అలాగే చెప్తున్నాయి. శాస్త్రాలు చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే ఆత్మ, దేహం ఒకటి కాదని ముందు గ్రహించాలి. ఇతర దేహాలకు లేని ప్రాధాన్యత మానవ దేహానికి ఎందుకని ఇచ్చారు ఇతర దేహాలు పూర్వ కర్మ ఫలాలను అనుభవించటానికి మాత్రమే. మానవ దేహం నూతనంగా కర్మలను ఆచరిన్చాగలదు. అదే ముఖ్యమైన తేడా. పశువుల జీవితాలు ఆహార స్వీకారం, నిద్ర మొదలైన వాటిలో గడిచిపోతున్నాయి.
"దండో ద్యత కరం పురుషమభిముఖముపలభ్యమాం
హంతు మయమిచ్చతీతి పలాయితుమారంభతే"
పశువులు ఎవరైనా కర్ర తీసుకొని వస్తే పారిపోతాయి. "హరితతృణ పూర్ణ పాణి ముపలభ్యతం ప్రత్యభి ముఖీ భవంతి" చేతిలో పచ్చగడ్డితో వస్తే అతనిని సమీపిస్తాయి. పశువులకు తెలిసిందంతే. కానీ మానవుదలా కాదు భగవద్దత్తమైన బుద్ధి కారణంగా మోక్షాన్ని కూడ సంపాదించగల యోగ్యతను కలిగియున్నాడు. అతని బుద్ధి వ్యవహరించే తీరును బట్టి ఎదైనా సాధించగలదు. అందువలన మానవజన్మ విశేషమైనదని శాస్త్రంలో చెప్పబడింది.
"మహతా పుణ్య పణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయా
పారం దుఃఖోదధేర్గన్తుం తర యావన్న భిద్యతే!!"
మానవదేహం ఒక నావలాంటిది. చాల ధనాన్ని వెచ్చించి దానిని ఖరీదు చేశాం. మరొకటి దొరుకుతుందో లేదో తెలియదు. దానితో ఒక మహాసాగరాన్ని దాటాలి. దానికి మధ్యలో బీటలు పడి, మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నావ ఎక్కువకాలం ఉండదనీ విదితమే. అలా పడిన బీటలు వారే లోపల, ఆ పడవను ఖరీదు చేసిన ఉద్దేశ్యం నెరవేర్చుకున్నట్లయితే అటువంటి వానిని తెలివైన వాడనాలి. ఇంతకీ ఆ మహాసాగరం ఏమిటి? జనన మరణ వలయమే ఒక మహాసాగరం. మానవ జీవిత సార్ధకత జ్ఞానము ద్వారానే సాధ్యమవుతుంది. కానీ మరో దానితో కాదు. మానవ దేహాన్ని పొందిన తరువాత కూడా జ్ఞాన సముపార్జనకై ప్రయత్నించని వారు మానవ జన్మను వృథా చేసినట్లే.అటువంటి వారు పశువులుగా జన్మించటమే మేలు. ఎందువల్లననగా పశువులకు ప్రత్యవాయం అంటూ ఉండదు కాబట్టి.
అపి మానుష్యకం లబ్ధ్వా భవంతి జ్ఞానినో న యే!
పశుతైవ వరం తేషాం ప్రత్యవాయాప్రవర్తనాత్!!
సంధ్యావందనాన్ని మనం నిర్ణీత సమయంలో చేయకపోతే పాపం వస్తుంది. కానీ పశువు సంధ్యావందనం చేయకపోతే ఏ పాపమూ రాదు. సంధ్యావందనం చేయని బ్రాహ్మణుని కంటే పశువే ఉత్తమమైనది. అందువలన మానవ జన్మ జ్ఞాన సముపార్జనకే అని తీర్మానం. మనం జ్ఞానాన్ని పొంది జీవితాన్ని సార్ధకమొనరించుకోవాలి.
Share:

Sunday 11 August 2013

శకున ఫలితములు

శకున ఫలితములు- తేనెపట్టు,అరటిగెల, మొండిచేయి - దిశాఫలితాలు
తేనెపట్టు :
తూర్పున యజమానికి ధనలాభం, ఆగ్నేయమున అగ్నిభయం, దక్షిణమున మరణము, నైఋతి ధాన్య నాశనము, పడమర మనోపీడ, వాయువ్యం ధననష్టం, ఉత్తరం పుత్రలాభం, ఈశాన్యం బంధుమిత్రలాభం.
అరటిగెల :
తూర్పు శుభం; ఆగ్నేయం శతృవృద్ధి, దక్షిణం బంధుమిత్ర నాశనం, నైఋతి పుత్రలాభం, పడమర విపత్తు, వాయువ్యం నేత్రహాని, ఉత్తరం ఐశ్వర్యం, ఈశాన్యం కీర్తిలాభం

మొండిచేయ్యి :
తూర్పు యజమానికి, నైఋతి పుత్రులకు, వాయువ్యం పశువులకు, ఉత్తరం, ఈశాన్యం భార్యకు కీడు, ఆగ్నేయం అగ్నిభయం, పడమర మరణం కలుగును.
పుట్టు మచ్చల ఫలితములు

ముక్కుమీద - కోపము, వ్యాపార దక్షత
కుడికన్ను - అనుకూల దాంపత్యము
ఎడమకన్ను - స్వార్జిత ధనార్జన
నుదిటి మీద - మేధావి, ధన వంతులు
గడ్డము - విశేష ధన యోగము
కంఠము - ఆకస్మిక ధన లాభం
మెడమీద - భార్యద్వారా ధనయోగం
మోచేయి - వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి
కుడిచేయి మణికట్టునందు- విశేష బంగారు ఆభరణములు ధరించుట
పొట్టమీద - భోజనప్రియులు
పొట్టక్రింద - అనారోగ్యం
కుడి భుజం - త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
బొడ్డులోపల - ధనలాభములు
కుడితొడ - ధనవంతులు
ఎడమతొడ - సంభోగం
చేతి బ్రొటన వ్రేలు - స్వతంత్ర విద్య, వ్యాపారం
కుడి చేయి చూపుడు వ్రేలు - ధనలాభము, కీర్తి
పాదముల మీద - ప్రయాణములు
మర్మస్థానం - కష్ట సుఖములు సమానం.

బల్లి పడుట వలన కలుగు శుభాశుభములు

పురుషులకు
తలమీద కలహం
పాదముల వెనక ప్రయాణము
కాలివ్రేళ్లు రోగపీడ
పాదములపై కష్టము
మీసముపై కష్టము
తొడలపై వస్త్రనాశనము
ఎడమ భుజము అగౌరవము
కుడి భుజము కష్టము
వ్రేళ్ళపై స్నేహితులరాక
మోచేయి ధనహాని
మణికట్టునందు అలంకారప్రాప్తి
చేతియందు ధననష్టం
ఎడమ మూపు రాజభయం
నోటియందు రోగప్రాప్తి
రెండు పెదవులపై మృత్యువు
క్రింది పెదవి ధనలాభం
పైపెదవి కలహము
ఎడమచెవి లాభము
కుడిచెవి దుఃఖం
నుదురు బంధుసన్యాసం
కుడికన్ను అపజయం
ఎడమకన్ను శుభం
ముఖము ధనలాభం
బ్రహ్మరంద్రమున మృత్యువు
స్త్రీలకు
తలమీద మరణసంకటం
కొప్పుపై రోగభయం
పిక్కలు బంధుదర్శనం
ఎడమకన్ను భర్తప్రేమ
కుడికన్ను మనోవ్యధ
వక్షమున అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి ధనలాభం
పై పెదవి విరోధములు
క్రిందిపెదవి నూతన వస్తులాభము
రెండుపెదవులు కష్టము
స్తనమునందు అధిక దుఃఖము
వీపుయందు మరణవార్త
గోళ్ళయందు కలహము
చేయుయందు ధననష్టము
కుడిచేయి ధనలాభం
ఎడమచేయి మనోచలనము
వ్రేళ్ళపై భూషణప్రాప్తి
కుడిభుజము కామరతి, సుఖము
బాహువులు రత్నభూషణప్రాప్తి
తొడలు వ్యభిచారము,కామము
మోకాళ్ళు బంధనము
చీలమండలు కష్టము
కుడికాలు శత్రునాశనము
కాలివ్రేళ్ళు పుత్రలాభం
రసజ్వలా విషయములు

రసజ్వలకు నక్షత్ర ఫలములు
అశ్వని: భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం.
భరణి :అనారోగ్యము, భీతి, అల్పాయువు.
కృత్తిక: కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము.
రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు.
మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు.
ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు.
పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది.
పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు.
ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది.
మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది.
పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది.
ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది.
హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది.
చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది.
స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి.
విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి.
అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు.
జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది.
మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది.
పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును.
ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి
శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది.
ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది.
శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది.
పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది.
ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు.
రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది
శుభస్వప్నములు

ఇష్టదేవతను చూచుట, పుష్పములు, పండ్లు, పశుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకరమగు వస్తువులను చూచుట, పశుపు పచ్చని వనములు మొదలగునవి. గుఱ్ఱములు, ఏనుగులు లేదా పల్లకి మొదలగు వాహనములు ఎక్కినటులయ, తాను ఏదోఒక భాధకు గురైనట్లు, రక్తము చూచినట్లు వేదము చదువుతున్నట్లు, పరస్త్రీని సంభోగించుచున్నట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు, నూత్యన వస్తు, వస్త్ర భూషణములు ధరించినట్లు కలగాంచుట శుభఫలదాయకము.
సుశకునములు

మనఃశ్శాంతి లేని సమయమున ప్రయాణము చేయ రాదు. బ్రాహ్మణులు. అశ్వములు, గజములు, ఫలములు, అన్నము, క్షీరము, గోవు, తెల్ల ఆవులు, పద్మములు, శుభవస్త్రములు, వేశ్యలు, మృదంగాది వాద్యములు, నెమళ్ళు, పాల పక్షి, బద్ధైక పశువు, మాంసము, శుభకార్యము వినుట, పుష్పములు చెరకు, పూర్ణకలశములు, ఛత్రములు, మృత్తిక, కన్య, రత్నములు, తల గుడ్డలు, తెల్లగుడ్డలు, పుత్రసహిత స్త్రీ, అద్దము, రజకులు, మత్స్యములు, నెయ్యి, సింహాసనము, ద్వజము, మేక, తేనె, అస్త్రములు, గోరోచనము, వేదధ్వని, మంగళగానములు యివి ఎదురుగా వచ్చిన సుశకునములని భావించి వెంటనే ప్రయాణము చేయ వలెను.
Share:

శకున ఫలితములు

శకున ఫలితములు- తేనెపట్టు,అరటిగెల, మొండిచేయి - దిశాఫలితాలు
తేనెపట్టు :
తూర్పున యజమానికి ధనలాభం, ఆగ్నేయమున అగ్నిభయం, దక్షిణమున మరణము, నైఋతి ధాన్య నాశనము, పడమర మనోపీడ, వాయువ్యం ధననష్టం, ఉత్తరం పుత్రలాభం, ఈశాన్యం బంధుమిత్రలాభం.
అరటిగెల :
తూర్పు శుభం; ఆగ్నేయం శతృవృద్ధి, దక్షిణం బంధుమిత్ర నాశనం, నైఋతి పుత్రలాభం, పడమర విపత్తు, వాయువ్యం నేత్రహాని, ఉత్తరం ఐశ్వర్యం, ఈశాన్యం కీర్తిలాభం

మొండిచేయ్యి :
తూర్పు యజమానికి, నైఋతి పుత్రులకు, వాయువ్యం పశువులకు, ఉత్తరం, ఈశాన్యం భార్యకు కీడు, ఆగ్నేయం అగ్నిభయం, పడమర మరణం కలుగును.
పుట్టు మచ్చల ఫలితములు

ముక్కుమీద - కోపము, వ్యాపార దక్షత
కుడికన్ను - అనుకూల దాంపత్యము
ఎడమకన్ను - స్వార్జిత ధనార్జన
నుదిటి మీద - మేధావి, ధన వంతులు
గడ్డము - విశేష ధన యోగము
కంఠము - ఆకస్మిక ధన లాభం
మెడమీద - భార్యద్వారా ధనయోగం
మోచేయి - వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి
కుడిచేయి మణికట్టునందు- విశేష బంగారు ఆభరణములు ధరించుట
పొట్టమీద - భోజనప్రియులు
పొట్టక్రింద - అనారోగ్యం
కుడి భుజం - త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
బొడ్డులోపల - ధనలాభములు
కుడితొడ - ధనవంతులు
ఎడమతొడ - సంభోగం
చేతి బ్రొటన వ్రేలు - స్వతంత్ర విద్య, వ్యాపారం
కుడి చేయి చూపుడు వ్రేలు - ధనలాభము, కీర్తి
పాదముల మీద - ప్రయాణములు
మర్మస్థానం - కష్ట సుఖములు సమానం.

బల్లి పడుట వలన కలుగు శుభాశుభములు

పురుషులకు
తలమీద కలహం
పాదముల వెనక ప్రయాణము
కాలివ్రేళ్లు రోగపీడ
పాదములపై కష్టము
మీసముపై కష్టము
తొడలపై వస్త్రనాశనము
ఎడమ భుజము అగౌరవము
కుడి భుజము కష్టము
వ్రేళ్ళపై స్నేహితులరాక
మోచేయి ధనహాని
మణికట్టునందు అలంకారప్రాప్తి
చేతియందు ధననష్టం
ఎడమ మూపు రాజభయం
నోటియందు రోగప్రాప్తి
రెండు పెదవులపై మృత్యువు
క్రింది పెదవి ధనలాభం
పైపెదవి కలహము
ఎడమచెవి లాభము
కుడిచెవి దుఃఖం
నుదురు బంధుసన్యాసం
కుడికన్ను అపజయం
ఎడమకన్ను శుభం
ముఖము ధనలాభం
బ్రహ్మరంద్రమున మృత్యువు
స్త్రీలకు
తలమీద మరణసంకటం
కొప్పుపై రోగభయం
పిక్కలు బంధుదర్శనం
ఎడమకన్ను భర్తప్రేమ
కుడికన్ను మనోవ్యధ
వక్షమున అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి ధనలాభం
పై పెదవి విరోధములు
క్రిందిపెదవి నూతన వస్తులాభము
రెండుపెదవులు కష్టము
స్తనమునందు అధిక దుఃఖము
వీపుయందు మరణవార్త
గోళ్ళయందు కలహము
చేయుయందు ధననష్టము
కుడిచేయి ధనలాభం
ఎడమచేయి మనోచలనము
వ్రేళ్ళపై భూషణప్రాప్తి
కుడిభుజము కామరతి, సుఖము
బాహువులు రత్నభూషణప్రాప్తి
తొడలు వ్యభిచారము,కామము
మోకాళ్ళు బంధనము
చీలమండలు కష్టము
కుడికాలు శత్రునాశనము
కాలివ్రేళ్ళు పుత్రలాభం
రసజ్వలా విషయములు

రసజ్వలకు నక్షత్ర ఫలములు
అశ్వని: భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం.
భరణి :అనారోగ్యము, భీతి, అల్పాయువు.
కృత్తిక: కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము.
రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు.
మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు.
ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు.
పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది.
పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు.
ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది.
మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది.
పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది.
ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది.
హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది.
చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది.
స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి.
విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి.
అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు.
జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది.
మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది.
పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును.
ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి
శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది.
ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది.
శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది.
పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది.
ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు.
రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది
శుభస్వప్నములు

ఇష్టదేవతను చూచుట, పుష్పములు, పండ్లు, పశుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకరమగు వస్తువులను చూచుట, పశుపు పచ్చని వనములు మొదలగునవి. గుఱ్ఱములు, ఏనుగులు లేదా పల్లకి మొదలగు వాహనములు ఎక్కినటులయ, తాను ఏదోఒక భాధకు గురైనట్లు, రక్తము చూచినట్లు వేదము చదువుతున్నట్లు, పరస్త్రీని సంభోగించుచున్నట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు, నూత్యన వస్తు, వస్త్ర భూషణములు ధరించినట్లు కలగాంచుట శుభఫలదాయకము.
సుశకునములు

మనఃశ్శాంతి లేని సమయమున ప్రయాణము చేయ రాదు. బ్రాహ్మణులు. అశ్వములు, గజములు, ఫలములు, అన్నము, క్షీరము, గోవు, తెల్ల ఆవులు, పద్మములు, శుభవస్త్రములు, వేశ్యలు, మృదంగాది వాద్యములు, నెమళ్ళు, పాల పక్షి, బద్ధైక పశువు, మాంసము, శుభకార్యము వినుట, పుష్పములు చెరకు, పూర్ణకలశములు, ఛత్రములు, మృత్తిక, కన్య, రత్నములు, తల గుడ్డలు, తెల్లగుడ్డలు, పుత్రసహిత స్త్రీ, అద్దము, రజకులు, మత్స్యములు, నెయ్యి, సింహాసనము, ద్వజము, మేక, తేనె, అస్త్రములు, గోరోచనము, వేదధ్వని, మంగళగానములు యివి ఎదురుగా వచ్చిన సుశకునములని భావించి వెంటనే ప్రయాణము చేయ వలెను.
Share:

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com